దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శ్రీవెంకటేశ్వర భక్తి చానెల్(ఎస్.వి.బి.సి) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఇంతకు ముందున్న చైర్మన్ నరసింహారావుపై ఆరోపపణలు వచ్చాయి. దాంతో కె.రాఘవేంద్రరావు ఎస్.వి.బి.సి ఛానెల్ చైర్మన్గా బాధ్యతలను తీసుకున్నారు. వయోభారం కారణంగా ఎస్.వి.బి.సి బాధ్యతల నుండి వైదొలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు లేఖ రాశారు రాఘవేంద్రరావు. టీటీడీ దేవస్థానానికి చెందిన సిబ్బందికి, యాజమాన్యానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని, తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.