Krishna Mukunda Murari March 8 2024 Episode 413: ముకుంద ఎలా ఈ శోభనాన్ని ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి రెడీ అవ్వకోకోకుండా ఉన్నా ముకుంద దగ్గరికి వెళ్లి తనని రెడీ చేస్తూ ఉంటుంది. ముకుంద మౌనంగా ఉండడంతో ముగుందని రెడీ చేస్తూనే రేవతి ఈ సమయంలో మీ భవాని అత్తయ్య ఉండుంటే చాలా బాగుండేది. తను నిన్ను చూసి మురిసిపోయేది అని అంటూ ముకుందని రెడీ చేస్తూ ఉంటుంది. రేవతి ఇంతకీ మా అక్కకి నువ్వు పాపని కనిస్తావా బాబుని కనిస్తావా అని అడిగితే ఎవరో ఒకరిని అయితే కనిస్తాను అత్తయ్య అని ముకుందా అంటుంది. అసలు అయినా నేను పిల్లల్ని అనేది కనాల్సి వస్తే అది మురారితోనే కంటాను అప్పుడు ఎప్పుడూ కూడా మీరే నాకు అత్తయ్య అవుతారు అని ముకుందా మనసులో అనుకుంటుంది. ముకుందని అందంగా ముస్తాబు చేస్తుంది. ఆదర్శ్ కి నువ్వంటే చాలా ఇష్టం అని తనతో ఇప్పటికైనా సఖ్యతగా ఉండమని చెబుతుంది. ముకుంద మాత్రం ఎలాగైనా సరే ఈ శోభనాన్ని క్యాన్సిల్ చేయాలని అనుకుంటుంది.
మధు ముందుగా మురారి ఏం చేస్తున్నాడు అని తన గదిలోకి వెళ్లి చూస్తాడు. ఇక ఎప్పుడు ఎప్పుడు శోభనం అవుతుందా అని మురారి కళ్ళు కదలికలు చూస్తేనే మధుకి అర్థం అయిపోతాయి. ఏంటి బ్రో? కృష్ణ వచ్చేవరకు ఆగలేక పోతున్నావా.. ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నావు అని మధు అంటాడు. ఇక మధు ఆల్ ద బెస్ట్ చెబుతాడు మురారి కి నేను ఆల్ ద బెస్ట్ చెప్పమని మా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు నీకు కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని మధు అనడంతో మురారి కావాలనే మధుని ఏడిపించడానికి.. మళ్లీ ఇంకోసారి ఆల్ ద బెస్ట్ మళ్లీ ఇంకోసారి ఆల్ ద బెస్ట్ చెప్పు అని మధుని ఆట పట్టిస్తూ ఉంటాడు మురారి.
ఆ తరువాత మధు ఆదర్శ గదిలోకి వెళ్తాడు. ఆదర్శ్ కూడా ముకుంద తో శోభనం కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఫ్రెండ్స్ అందరూ ఆదర్శ్ కి వరుసగా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్లకి అమౌంట్ వేస్తూనే ఉంటాడు ఏంటి బ్రో ఏం చేస్తున్నావు అంటే నా ఫ్రెండ్స్ కి అనవసరంగా నా శోభనం అని చెప్పాను అప్పటినుంచి అందరూ ఆడుకుంటున్నారు ఎవరికైనా శోభనానికి ఎంత ఖర్చవుతుంది చెప్పు అని మధుని ఆదర్శ్ అడుగగా మహా అయితే 15000 అవుతాయి అని మధు అంటాడు. నాకైతే లక్షన్నర ఖర్చయింది అని ఆదర్శ అంటాడు. బ్రో బయట వాళ్లనే కాదు ఇంట్లో ఉన్న నన్ను కూడా పట్టించుకోమని మధు ఆదర్శ్ ని అడుగుతాడు ఇక ఆదర్శ్ తప్పక మధుకి కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు.
ఇక కృష్ణుని సుమలత రెడీ చేస్తుంది అత్తయ్య నేను ఇంకా గదిలోకి వెళ్ళనా అని కృష్ణ అంటుంది. ఏంటి కృష్ణ ఇంకా కాసేపు ముహూర్తానికి టైం ఉంది అప్పటివరకు ఆగు అని సుమలత అంటుంది కానీ, కృష్ణ మనసులో ఇంకో విషయం గురించి బాధపడుతుందని సుమలతకి అర్థం కాదు. అంత తొందరేంటి కృష్ణ ఇన్నాళ్లు ఆగావు కదా ముహూర్తం వరకు ఆగాలి అని సుమలత అంటుంది. ఇక ముహూర్తం టయానికి కృష్ణుని గదిలోకి పంపిస్తుంది సోమలత ఇక గదిలోకి వెళ్లే కృష్ణ మురారితో ఈ శోభనం ఎలా ఆపాలో అర్థం కావడం లేదు అని కంగారుపడుతూ ఉంటుంది. మరోవైపు ముకుందని రేవతి శోభనం గదిలోకి పంపించబోతుంటే అత్తయ్య నేను వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్పి ముకుంద ఒక్కటే నడుచుకుంటూ గదిలోకి వెళుతుంది. ఇక ఆదర్శం ముకుందను చూసి సంతోషిస్తాడు . పాల గ్లాసు ఇవ్వకుండా పక్కన పెట్టడం చూసి ఆదర్శ్ ఫీలవుతాడు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా చాలా చప్పగా చప్పగా సాగుతుంది. కాస్త బోరింగ్ గా అనిపించింది ఇవాళ్టి ఎపిసోడ్.
రేపటి ఎపిసోడ్లో ఇద్దరూ జంటలు శోభనం గదిలోకి వెళ్తాయి. మురారి కృష్ణని దగ్గరకు తీసుకోబోతుండగా పక్క రూమ్లో ఆదర్శ్ ముకుంద లకు కూడా శోభనం జరుగుతుంది. ముకుంద ఆదర్శ్ కి నిజం చెప్పేస్తే ఏమవుతుందో అని కృష్ణ కంగారుపడుతూ ఉంటుంది. పాల గ్లాస్ తో గదిలోకి వచ్చిన ముకుందను ఆదర్శ్ దగ్గరికి తీసుకుంటాడు. తను తాగిన పాలను ముకుందకి ఇస్తే వద్దు ఇదే ఎంగిలి చేసిన పాలను మురారి ఇస్తే సంతోషంగా తీసుకునే దానిని.. ఎందుకంటే నా జీవితాన్ని పంచుకోవాలనుకుంది మురారితోనే కదా అని ముకుందా అంటుంది. ఆ మాటలు విన్న ఆదర్శ్ కోపంగా కిందకు వచ్చి మురారిని కిందకు రమ్మని పిలుస్తాడు. దాంతో ఇద్దరు శోభనాలు ఆగిపోతాయి.