సూపర్స్టార్ మహేష్తో సినిమా అంటే సాధారణంగా ఏ దర్శకుడు, నిర్మాతకైనా ఆనందంగానే ఉంటుంది. దర్శకుడికి కావాల్సినంత గుర్తింపు దక్కితే.. నిర్మాతలకు మాత్రం లాభాలను దండుకోవచ్చునని. అయితే మహర్షి నిర్మాతలు దిల్రాజు, అశ్వినీదత్, పివిపి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సినిమా అనుకున్న బడ్జెట్ను క్రాస్ అయ్యిది. సరేలే! సినిమాను అనుకున్న బడ్జెట్ కంటే మించి మార్కెట్ చేసుకున్నారా? అంటే అది కూడా లేదని ఫిలింనగర్లో గుసగుసలు వినపడుతున్నాయి. సినిమా 130 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందితే.. బిజినెస్ అయ్యింది 110 కోట్లకేనని సమాచారం. సినిమా తిరుగులేని బ్లాక్బస్టర్ అయితే తప్ప.. నిర్మాతలకు వారు పెట్టిన బడ్జెట్ వచ్చే అవకాశమే లేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
మహేష్ 25వ చిత్రంగా `మహర్షి` ప్రేక్షకుల ముందుకు మే 9న రానుంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!