SVP: ఎంతటి సినిమా అయినా జనాల్లోకి బలంగా వెళ్ళాలి అంటే ప్రమోషన్ గట్టిగా జరగాలి. అయితే కరోనా వచ్చాక పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి అన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సినిమా ప్రమోషన్ లు చాలావరకు ఇంటర్వ్యూలతో కానిచ్చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మే 12వ తారీకు “సర్కారు వారి పాట” రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా మేకర్స్ సరికొత్త డిఫరెంట్ ట్రెండింగ్ ఈవెంట్ లు ఇండస్ట్రీలో క్రియేట్ చేశారు. అవిఏమిటంటే “ప్రీ రిలీజ్” వేడుక తోపాటు సినిమా మ్యూజిక్ కి సంబంధించి ఒక బిగ్ ఈవెంట్ రెండు కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. ఈ రెండు కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో టూర్ కి వెళ్ళటం జరిగింది. వచ్చిన వెంటనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జాయిన్ అవబోతున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ పరుశురాం హీరోయిన్ కీర్తి సురేష్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే రీతిలో సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల చేయడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక విడుదలకు నాలుగు రోజుల ముందు నుండి మహేష్ బాబు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ కానున్నారని సమాచారం. ఇదిలా ఉంటే “సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎస్ ఎస్ రాజమౌళి రానున్నారని సినిమా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమా విడుదల కాకముందు మహేష్ నటించిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు మూడు కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడం జరిగింది. అయితే “సర్కారు వారి పాట” సినిమా తన కెరీర్లోనే మరో “పోకిరి” అని మహేష్ గతంలో చెప్పడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా సినిమాల్లో చాలా రాఫ్ క్యారెక్టర్ లో మహేష్ స్టైలిష్ గా కనిపిస్తూ ఉండటంతో.. పాటు కొత్తగా శ్రీకాకుళం యాసలో డైలాగులు పలకడంతో.. “సర్కారు వారి పాట” చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!