ఈ ఏడాది కరోనా దెబ్బకు అన్నీ వ్యవస్థలు అతలాకుతం అయ్యాయి. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ మెగా హీరోలంతా టాలీవుడ్ లో సందడి చేద్దాం అనుకునే లోపే వారి ఆశలపై నీళ్లు చల్లింది కరోనా మహమ్మారి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ఆచార్య. ఈచిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈఏడాది విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ వల్ల వచ్చి ఆగిపోయింది. ఆ తరువాత షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునే లోపు చిరు కరోనా బారిన పడడంతో మరి కొన్ని రోజులు వాయిదా పడింది. ఈ మధ్యే షూటింగ్ ప్రారంభం కాగా వచ్చే సంవత్సరంలోనే ఈ చిత్రం విడుదలకు నోచుకోనుంది.
రాజకీయ ప్రవేశం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం కూడా ఈ కరోనా వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అన్ లాక్ తరువాత ఈమద్యే షూటింగ్ మొదలైంది. మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం కూడా కేరళలో షూట్ చేయాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల ఈస్ట్ గోదావరి ప్రాంతంలోకి షూటింగ్ షిఫ్ట్ చేసిన అక్కడ షూటింగ్ జరుగుతుండగా సిబ్బందికి కరోనా రావడంతో మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఇప్పటికి కూడా షూటింగ్ ప్రారంభం కాలేదు. త్వరలోనే హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు సమాచారం.
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి, సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలు షూటింగ్ పూర్తైన కూడా విడుదలకు నోచుకోలేదు. మెగా ఫ్యామిలీ నుండి పరిచయమవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ నటించిన లవ్ ఎంటర్టైనర్ ఉప్పెన ఓటిటిలో విడుదలకు అవకాశాలు వచ్చిన నిర్మాతలు అంగీకరించలేదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!