Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన “భోళాశంకర్” గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలై అట్టర్ ప్లాప్ అయ్యింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. వరుస పరాజయాలలో ఉన్న దర్శకుడు కావడంతో మెహర్ రమేష్ సినిమా విషయంలో మొదటి నుండి మెగా ఫ్యాన్స్..భోళా శంకర్ పై పెద్దగా నమ్మకాలు పెట్టుకోలేదు. అందరూ అంచనా వేసినట్టుగానే సినిమా బోల్తా పడింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ఓకే చేయడానికి చిరంజీవి చాలా టైం తీసుకున్నారు. చివర ఆఖరికి బింబిసారా దర్శకుడు వంశీ దర్శకత్వంలో “విశ్వంభర” ఓకే చేయడం జరిగింది.
ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ గత ఏడాది నవంబర్ నెలలో రాజమండ్రి మారేడుమల్లి అడవులలో షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చిన్నపాటి సర్జరీ జరగటంతో పాటు వరుణ్ తేజ్ పెళ్లి నేపథ్యంలో చాలా రోజులు సెలవులు తీసుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఇటీవల భార్య సురేఖతో కలిసి అమెరికాకి చిన్న ట్రిప్ వేశారు. ఆ సమయంలో తిరిగి వచ్చాక “విశ్వంభర” షూటింగ్ స్టార్ట్ అవుతుందని చిరంజీవి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి 26వ తారీకు నుండి ప్లాన్ చేయడం జరిగింది.
ఈసారి హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్లు ఇషా చావ్లా, సురభి కూడా ఇందులో నటిస్తున్నారని, ఇప్పటికే వీరిపై కొన్ని సీన్లు షూట్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో స్లిమ్ గా కనిపించడం కోసం చిరంజీవి.. ఎన్నో వర్కౌట్స్ చేయడం జరిగింది. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత హైబడ్జెట్ సినిమాగా “విశ్వంభర” తెరకెక్కుతోంది.