Rajamouli – Prashanth neel: కేవలం మూడు సినిమాలతోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ను టాలీవుడ్ దర్శల ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో కంపేర్ చేస్తున్నారు అభిమానులు నెటిజన్లు. కానీ, టాలీవుడ్ ప్రేక్షకులు, జక్కన్న ఫ్యాన్స్ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. రాజమౌళితో ఏ రకంగా కూడా ప్రశాంత్ నీల్ను కంపేర్ చేయడానికి కుదరదని కామెంట్స్ చేస్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి సింహాద్రి, మగధీర, విక్రమార్కుడు, యమదొంగ, ఛత్రపతి లాంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్గా మారారు.
ఇక బాహుబలి సిరీస్ చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను నెలకొల్పడమే కాదు..దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించారు. ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు నిర్మితమవుతున్నాయంటే, హీరోలకు పాన్ ఇండియన్ స్టార్స్గా క్రేజ్ దక్కుతుందంటే దానికి కారణం ఖచ్చితంగా రాజమౌళినే అని చెప్పక తప్పదు. ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ను మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద చూపించారు. ఇంత సక్సెస్ సాధించిన స్టార్ డైరెక్టర్తో మూడు చిత్రాలను తీసిన ప్రశాంత్ నీల్ను పోల్చడం నిజంగా కరెక్ట్ కాదేమో.
Rajamouli – Prashanth neel: ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని మెజారిటీ జనాలు అభిప్రాయపడుతున్నారు.
కన్నడలో ఉగ్రమ్ అనే సినిమాను తీసి అందరి దృష్ఠిని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ యష్తో తీసిన కేజీఎఫ్ ఛాప్టర్ 1తో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా కొనసాగింపు కూడా వచ్చి అత్యంత భారీ స్థాయిలో వసూళ్ళు నమోదు చేస్తుందని చెప్పుకుంటున్నారు. అంతగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. కథ, కథనం పక్కన పెడితే యాక్షన్ సీన్స్ పరంగా గొప్ప పేరు వచ్చింది. దాంతో పాన్ ఇండియన్ సినిమాలు తీసే దర్శకుడు రాజమౌళితో ఇప్పుడు ప్రశాంత్ నీల్ను పోల్చి మాట్లాడుకుతున్నారు. కానీ, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని మెజారిటీ జనాలు అభిప్రాయపడుతున్నారు.