ప్రస్తుతం అంతా డిజిటల్ ప్లాట్ ఫామ్ కు మంచి డిమాండ్ ఉంది. మొన్నటి వరకూ సినిమా విడుదలైన 45 రోజులకో రెండు నెలలకో ఇక్కడ రిలీజ్ అయ్యేవి. నిర్మాతలకు సౌలభ్యంగా ఉండేది. ఆడియన్స్ కూడా రిపీట్ చేసేందుకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ను ఆశ్రయించేవారు. ప్రస్తుతం పరిస్థితులన్నీ తారుమారై పోయాయి. కరోనా చేసిన పనికి కొత్త సినిమా అనేది అందనంత దూరంలో ఉండిపోయింది. ధియేటర్లు మూతపడ్డాయి. రిలీజ్ కు రెడీగా దాదాపు 20 సినిమాలున్నాయి.
కానీ.. ధియేటర్లలోనే రిలీజ్ చేయాలని కొన్ని, త్వరలో ఓపెన్ చేస్తారేమో అని మరికొన్ని, ఓటీటీల్లో మంచి ఆఫర్స్ వస్తే చూద్దామంటూ మరికొన్ని సినిమాలు ఉన్నాయి. వీటిలో నాని ‘వి’ సినిమా ముందు వరుసలో ఉంది. సరిగ్గా వారంలో రిలీజ్ అనగా ధియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడీ సినిమాకు మంచి ఆఫర్ ఇస్తున్నాయి ఓటీటీలు. కానీ.. నానీ ఇష్టపడటం లేదని ఓ టాక్. సినిమా కంటెంట్ బిగ్ స్క్రీన్ లో బాగుటుందని.. మంచి మార్కెట్ ఉన్న తన సినిమాలు ఓటీటీల్లో అలవాటు చేస్తే తర్వాతి సినిమాల పరిస్థితేంటన్న ఉద్దేశంలో అటువైపు వద్దంటున్నాడని టాక్.
నిశ్శబ్దం కూడా ఇన్నాళ్లూ వేచి చూసినా ఇక డిజిటల్ లో రిలీజ్ చేసేద్దామనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మంచి బజ్ క్రియేట్ అయిన రామ్ రెడ్ కూడా డిజిటల్ రిలీజ్ వద్దనే అంటున్నాడట హీరో. ఇస్మార్ట్ క్రేజ్ కంటిన్యూ కావాలంటే ధియేటర్ రిలీజ్ బెస్ట్ అంటున్నాడట. మరికొన్ని సినిమాల నిర్మాతలు ఓటీటీ బెస్ట్ అనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కానీ.. హీరోలు వద్దంటున్నారని సమాచారం.