SVP: `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నుంచి వచ్చిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమైన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ సమ్మర్ కానుకగా మే 12న విడుదలైంది.
బ్యాంకులు, అప్పుల నేపథ్యంలోనే ఈ మూవీ సాగుతుంది. ఇందులో మహేశ్ తన లుక్స్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు. యాక్షన్ పరంగానూ ఈ మూవీ ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. మొన్నీమధ్యే ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్లోకి ఎంటర్ అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, ఈ చిత్రం పే-పర్-వ్యూ పద్దతిలో అందుబాటులోకి వచ్చింది. రూ. 199 చెల్లించి ఈ సినిమాను అద్దెకు తీసుకోవచ్చు. అయితే ఈ విషయంపై సినీ ప్రియులే కాదు.. మహేశ్ అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఓటీటీలోనూ డబ్బులు చెల్లించాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సర్కారు వారి పాట చిత్రాన్ని ఫ్రీగా వీక్షించేందుకు అమెజాన్ వారు డేట్ ఫిక్స్ చేశారు.
జూన్ 23 నుండి ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లు ఉచితంగా చూడొచ్చు. అంటే సర్కారు వారి పాటను ఓటీటీ వేదికగా ఫ్రీగా చూడాలంటే ఇంకా 17 రోజులు ఆగాల్సిందే..తప్పదు. కాగా, మహేశ్ బాబు తన నెక్స్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నాడు. ఆపై రాజమౌళితో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!