NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే 20న తన 39వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు అభిమానులు, నెటిజన్లు, సినీ తారల నుంచి ఎన్టీఆర్కు విషెస్ వెల్లువెత్తాయి. మరోవైపు ఆయన నటించబోయే `ఎన్టీఆర్ 30`, `ఎన్టీఆర్ 31`ల నుంచి అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఎన్టీఆర్ ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్లో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆయన భార్య కూడా పాల్గొనడంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. గతంలో వంశీ పైడిపల్లి, ఎన్టీఆర్ కాంబినేషన్లో `బృందావనం` వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ మూవీ 2010 అక్టోబర్ 14న విడుదలై మంచి విజయం సాధించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తాజాగా ఎన్టీఆర్ వంశీ ఫ్యామిలీతో కలిసి బర్త్డేను సెలెబ్రేట్ చేసుకోవడంతో.. ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్గా మారాయి. దీంతో వీరి కాంబోలో మళ్లీ ఏమైనా సినిమా వస్తుందా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. పైగా తాజాగా బయటకు వచ్చిన పిక్స్లో వంశీ ఆప్యాయంగా ఎన్టీఆర్ ని హగ్ చేసుకోవడంతో.. వీరి కాంబో ప్రాజెక్ట్పై అభిమానుల్లోఆసక్తి పెరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాగా, వంశీ పైడిపల్లి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతితో సినిమా చేస్తున్నాడు. `దళపతి 66` వర్కింగ్ టైటిల్లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!