BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ కలిసి నటించింది “బ్రో” సినిమా జూలై 21వ తారీకు రిలీజ్ కాబోతోంది. జులై 25 వ తారీకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 21వ తారీకు “BRO” ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. “వినోదయ సీతం” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నారని టాక్. సాయి ధరమ్ తేజ్ ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన సామాన్య వ్యక్తి గా నటించబోతున్నాడట. దేవుడు సామాన్య మానవుడి మధ్య తలెత్తే సన్నివేశాలను ప్రధానం చేసుకొని ఈ సినిమా తీసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ రాయడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మరియు ఫోటోలు టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం మెగా హీరోలలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి మల్టీస్టారర్ చేయటం.. మెగా ఫాన్స్ లో సంచలనం సృష్టించింది. కేవలం ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ 30 రోజులు మాత్రమే కాల్సీట్స్ ఇవ్వడం జరిగిందంట. నెల రోజులకి దాదాపు 40 కోట్లకు పైగా పవన్ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. సముద్రఖని ఈ సినిమాకి దర్శకుడు. తమిళంలో “వినోదయసీతం” సినిమాలో సముద్రఖని నటించడం జరిగింది. తెలుగులో ఫస్ట్ టైం దర్శకుడిగా పవన్ కళ్యాణ్ తో ఆయన సినిమా చేయటం.. ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి ముందు తెలుగులో పలు నెగటివ్ పాత్రలలో సముద్రఖని.. నటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని.. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి యాత్రలు చేపడుతూ మరోపక్క సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈసారి ఎలాగైనా గెలిచే అసెంబ్లీలో అడుగు పెట్టాలని.. పవన్ మొండి పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని గద్దె దించడమే తన మొదటి ప్రాధాన్యత అంటూ.. ప్రతి సభలో చెప్పుకొస్తున్నారు. ఇటీవల ఏపీలో రెండు గోదావరి జిల్లాలలో చేపట్టిన వారహి విజయ యాత్ర పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది. ఇదిలా ఉంటే “బ్రో” సినిమాకి సంబంధించి వచ్చే వారంలో రెండు మూడు ఇంటర్వ్యూస్ ప్రమోషన్ కార్యక్రమంలో ఇవ్వటానికి పవన్ రెడీ అవుతున్నట్లు టాక్.