తెలుగు ఇండస్ట్రీలో ఎదురులేని తారగా ఎదిగి ఈమద్య డ్రగ్స్ కేసులతో వార్తల్లోకెక్కిన యోగా బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ పెద్దోళ్ల సరసన నటిస్తోన్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈరోజు ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక ఫోటో షేర్ చేశాడు. తాను నటించే నెక్స్ట్ చిత్రం ‘మేడే’లో తనతోపాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీతిసింగ్ నటించనుందని, ఆ చిత్ర షూటింగ్ ప్రారంభమైందని తెలిపాడు. ఈ చిత్రానికి డైరెక్టర్, నిర్మాతగా అజయ్ దేవగన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుందని తెలిపాడు.
ఈ యోగా బ్యూటీకి గత ఏడాది మాత్రం అస్సలు కలిసిరాలేదనే చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలకు రకుల్ ఒకే చెప్పినట్టు సమాచారం. విలక్షణ నటుడు మోహన్ బాబు నటిస్తున్న సన్ అఫ్ ఇండియా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సరసన ఒక చిత్రంతో పాటు క్రిష్ జాగర్లమూడి వైష్ణవ్ తేజ్ పక్కన చిందులేయనుంది ఈ యోగ సుందరి. వీటితో పాటు తమిళ చిత్రాలు కమల్ హస్సన్ సరసన భారతీయుడు 2లో, శివ కార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ తారలు జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ చిత్రాలు రకుల్ చేతిలో ఉన్నాయి.
నితిన్ ప్రస్తుతం రంగ్ దే షూటింగ్ దుబాయిలో జరుగుతుంది. ఆ టీం హైదరాబాద్ రాగానే నితిన్-రకుల్ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం రకుల్ నటిస్తోన్న మేడే చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ చిత్రాలలో సగం చిత్రాలు 2021 సంవత్సరంలోనే విడుదల కానున్నాయి. ‘మేడే’ చిత్రం మాత్రం 2022 ఏప్రిల్ 29న విడుదల చేస్తానని అజయ్ దేవగన్ తెలిపాడు. ఈ నూతన సంవత్సరం తరువాత రకుల్ ఖాతాలో విజయాలు చేరి మళ్ళీ పూర్వవైభవం పొందే అవకాశం ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!