Samantha Naga Chaitanya: హీరోయిన్ సమంత మరియు నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకుని రెండు సంవత్సరాలు కావస్తోంది. ఇండస్ట్రీలో ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట విడిపోవడం చాలామందికి బాధను కలిగించింది. నాగచైతన్య హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాక “ఏం మాయ చేసావే” సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతోనే హీరోయిన్ గా సమంత పరిచయమైంది. సామ్ తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కానీ నాగచైతన్య కంటే సమంత మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడి 2017లో వివాహం చేసుకున్నారు.
కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకు 2021లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఏ కారణంగా ఇద్దరు విడిపోయారు అన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. అనంతరం సమంత 2022లో మాయోసైటీస్ అనే వ్యాధి బారినబడి… కెరియర్ పరంగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఈ జంట విడాకులు తీసుకున్న తర్వాత కలవాలని చాలామంది భావించారు. కానీ అది కుదరలేదు. ఒకే వేదికపై లేదా కార్యక్రమంలో ఇద్దరు పాల్గొంటే చూడాలని చాలామంది భావించారు. అలాంటి సందర్భాలు మొన్నటి వరకు తారసపడలేదు.
కానీ ఇటీవల లేటెస్ట్ గా ముంబైలో ఓ కార్యక్రమానికి.. సమంత మరియు నాగచైతన్య హాజరయ్యారు. ముంబైలో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇద్దరు వచ్చిన వేదిక పైకి మాత్రం వేర్వేరు సందర్భాలలో రావటం గమనార్హం. “దూత” వెబ్ సిరీస్ విజయం పై నాగచైతన్య, హిందీలో చేస్తున్న వెబ్ సిరీస్ గురించి సమంత మాట్లాడటం జరిగింది. తమ మూవీస్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు అనుకోకుండా ఒకే ఈవెంట్ కి హాజరయ్యారు. విడాకులు తీసుకున్నా అనంతరం ఈ ఇద్దరూ కెరియర్ పరంగా ఎవరికి వారు తమ తమ ప్రాజెక్టులలో బిజీ అయిపోయారు. వరుసపరాజయాలలో ఉన్న సమంత గత ఏడాది “ఖుషి” సినిమాతో విజయం సాధించింది. నాగచైతన్య ప్రస్తుతం “తండెల్” సినిమాతో బిజీగా ఉన్నాడు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!