Samantha: హీరోయిన్ సమంత “ఖుషి” సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకుని ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇవ్వటం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత కొన్ని నెలల పాటు పవర్ ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. దీంతో మునుపటి చాయని పోగొట్టుకున్న సమంత ఇప్పుడు మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతురాలు అవ్వటానికి సినిమాలకు దూరమై.. ఒక ఏడాది రెస్ట్ తీసుకోవడానికి సిద్ధపడింది. దీనిలో భాగంగా ప్రపంచంలో తనకు నచ్చే ప్రదేశాలను తిరుగుతూ విహారయాత్రలు చేస్తూ ఉంది. మొన్ననే ఆస్ట్రియాలో తిరుగుతూ అక్కడ అందమైన లోకేషన్ లలో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది.
తాజాగా ఈ రీతిగానే సమంత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఒక షాపు గోడ దగ్గర నిలబడి ఫోటో దిగింది. సమంత వెనకాల “ఎవ్రీ బడీస్” డార్లింగ్ అని రాసి ఉంది. అలాగే ఎవరు వద్దన్నా కాదన్నా ఆ ఇద్దరితో కలిసి బతుకుత అని అర్థం వచ్చేలా ఈ ఫోటో క్రింద క్యాప్షన్ పెట్టింది. దీంతో సమంత పెట్టిన పోస్ట్ కి హీరోయిన్ త్రిష నవ్వుతూ రిప్లై ఇచ్చింది. ఇదే సమయంలో కొందరు అభిమానులు నువ్వు మా అందరి డార్లింగ్ అని రిప్లై ఇస్తున్నారు. బ్లాక్ డ్రెస్ బ్లూ జీన్ లో సమంత బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని… దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక వచ్చే ఏడాది అక్టోబర్ లేదా సెప్టెంబర్ నెలలో మళ్లీ సినిమాలు చేయాలని.. అంతవరకు రెస్ట్ తీసుకోవాలని సమంత ఫుల్ గా డిసైడ్ అయ్యిందట. మయో సైటీస్ వ్యాధికి గురైన సమయంలో.. తీసుకున్న చికిత్సకి చాలా గ్లామర్ పోయింది. ఆ ప్రభావం “ఖుషి” సినిమాలో కొన్ని సన్నివేశాలలో కనిపించింది. అయితే వ్యాధి బారిన నుండి పూర్తిగా బయటపడ్డ సమంత ఇప్పుడు గ్లామర్ పై ఫోకస్ చేయడం జరిగిందట. ఈ క్రమంలో విదేశాలలో ఒక ఏడాది పాటు రెస్ట్ తీసుకుని తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చి యధావిధిగా ప్రాజెక్టులు ఒప్పుకోబోతున్నట్లు టాక్.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!