Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న సామ్.. కెరీర్ పైనే దృష్టి సారించి వరుస ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతోంది.
ఇప్పుడీమె చేస్తున్న సినిమాల్లో `యశోద` ఒకటి. ఈ సినిమాకు హరీశ్ శంకర్, హరీశ్ నారాయన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీదేవీ మూవీ బ్యానర్పై శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్కుమార్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. సమంత ప్రస్తుతం ఇంట్లో కాకుండా యశోద కోసం వేసి సెట్లోనే నివాసం ఉంటుందట. అసలేమైందంటే.. యశోద మూవీ కోసం ఇటీవల హైదరాబాద్ లో సెవన్ స్టార్ హోటల్ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో రూ. 3 కోట్లు వెచ్చించి డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ తో పాటు అన్ని సౌకర్యాలతో కూడిన అత్యాధునికమైన హోటల్ ను తలపించేలా రియలిస్టిక్ గా సెట్ ను తీర్చిదిద్దారు.
అయితే ఆలస్యం కాకుండా షూటింగ్ త్వరత్వరగా పూర్తి చేయాలనే ఉద్ధేశంలో సమంత ఆ సెట్లోనే నివాసం ఉంటోందట. పైగా సెట్లో అన్ని వసతులు ఉన్నాయి. అందువల్లే సామ్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అక్కడే ఉంటూ తన షూటింగ్ పార్ట్ను ఫినిష్ చేస్తోందని అంటున్నారు.