Samantha: నాగచైతన్య నుంచి విడిపోయిన దగ్గర నుంచీ కెరీర్పైనే ఫోకస్ పెట్టి వరుస ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తోన్న సమంత.. మరోవైపు సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్గా ఉంటోంది. ముఖ్యంగా గ్లామర్ ఫొటో షూట్లతో కుర్రాళ్ళను అల్లాడిస్తోంది. మొన్నీ మధ్య క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్ సామ్ను వరించిన సంగతి తెలిసిందే.
ముంబైలో ఆ అవార్డ్ ఫంక్షన్ జరగగా.. అక్కడ ఆమె గ్రీన్ అండ్ బ్లాక్ డ్రెస్లో సూపర్ హాట్గా దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సమంతను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. కొందరైతే వెటకారంగా కూడా కామెంట్స్ చేశారు. అయితే వీటిపై తాజాగా స్పందించిన సమంత దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
తన ఫోటోస్ షేర్ చేస్తూ.. `మహిళలు ధరించే దుస్తులు, వారి మతం, చదువు, సామాజిక స్థితి, రూపురేఖలు, రంగు.. ఇలా ఎన్నో రకాలు వివక్షను చూపుతుంటారు. మహిళలను చాలా సులభంగా జడ్జ్ చేసేస్తుంటారు. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కానీ, ప్రస్తుతం మనం 2022లో ఉన్నాము.
ఇప్పటికీ మహిళ అలంకరణ, డ్రెస్సింగ్ గురించి జడ్జ్ చేయడం ఆపరా ? ఎదుటివారు ఏం చేస్తున్నారు.. ఎలా ఉంటున్నారు అనేది ఆలోచించడం పక్కన పెట్టి.. తమపై తాము దృష్ణి పెట్టలేరా?` అంటూ రాసుకొచ్చింది. మొత్తానికి సామ్ ఇకనైనా సోది కామెంట్లు ఆపమంటూ తన పోస్ట్తో పరోక్షంగా చెప్పకనే చెప్పేసింది. దీంతో ఆమె పోస్ట్ కాస్త వైరల్గా మారింది.