Tollywood: ప్రపంచ సినిమా రంగంలో తెలుగు సినిమాల మార్కెట్ పెరిగింది. దీనికి ప్రధాన కారణం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి 2, RRR దేశంలోనే కాదు విదేశాలలో సత్తా చాటాయి. RRR కి ఆస్కార్ అవార్డు రావడంతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాలతో పాటు అల్లు అర్జున్ నటించిన పుష్ప, నిఖిల్ కార్తికేయ.. ఇంకా హీరో ప్రభాస్ సినిమాలకి టాలీవుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది. ఇతర ఇండస్ట్రీలలో తెలుగు సినిమాలు విడుదలవుతున్న సమయంలో స్టార్ హీరో ఎవరు కూడా సినిమాలో రిలీజ్ చేయని పరిస్థితి ఏర్పడింది. దీంతో టాలీవుడ్ నిర్మాతలు తెలుగు మార్కెట్ దృష్టిలో పెట్టుకుని చాలా తెలివిగా ఆలోచిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు.
విషయంలోకి వెళ్తే భారీ బడ్జెట్ లతో సినిమాలు నిర్మిస్తూ సీక్వెల్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఈ రకంగానే ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీక్వెల్ ట్రెండ్ కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు ఒకే పార్ట్ తో కాకుండా సీక్వెల్స్ తీసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రకంగా ఈ ఏడాది విడుదలయ్య మెజారిటీ సినిమాలలో ఎక్కువగా సీక్వెల్స్ ప్రాజెక్టులే ఉన్నాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకి ఇప్పుడు “పుష్ప 2” సీక్వెల్ గా ఆగస్టు 15వ తారీకు రిలీజ్ కాబోతోంది. పుష్ప 2021లో విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. తగ్గేదేలే డైలాగ్ ప్రపంచంలో మారుమోగింది.
ఇక తర్వాత ప్రభాస్ “సలార్” సీక్వెల్ కి “సలార్ 2” కూడా ఈ ఏడాదే విడుదల కాబోతోంది. ఈ రకంగా ఎన్టీఆర్ దేవర సినిమాకి సెకండ్ పార్ట్ కూడా రాబోతోంది. హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్, బాలకృష్ణ అఖండ సినిమాకి సెకండ్ పార్ట్ అఖండ 2, టిల్లు స్క్వేర్, డబుల్ ఇస్మార్ట్, గూడచారి 2, హిట్ 3, బింబీసారా 2, ప్రాజెక్ట్ K 2, గీతాంజలి మళ్లీ వచ్చింది, కార్తికేయ 3, విరూపాక్ష 2.. సినిమాలు సీక్వెల్ గా విడుదల కాబోతున్నాయి.
Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!