Srimukhi :బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో సుమ వ్యాఖ్యాతగా నిర్వహిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం మనకు తెలిసినదే. సుమ మాటతీరుతో, చమత్కారాలు చేస్తూ అందరిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న స్టార్ మ్యూజిక్ ప్రోగ్రాం కు సుమ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి, రోల్ రైడ, విష్ణు ప్రియ, డాన్సర్ పండు తదితరులు పాల్గొన్నారు. ఈ షోకు యాంకర్ గా ఉన్న సుమ వీరిని టీమ్స్ గా విభజించి , కార్యక్రమంలో భాగంగానే వీరిని పలు ప్రశ్నలు అడుగుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఓ రౌండ్ లో భాగంగా పాటను గెస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే చిరంజీవి పాటను ఫజిల్ గా ఇచ్చారు. అయితే ఈ పాటను కరెక్ట్ గా గెస్ చేసిన శ్రీముఖి చిరంజీవి, రాధిక హిట్ సాంగ్ అయినా “నవ్వింది మల్లి చెండు”.. అనే పాటను గెస్ట్ చేయడమే కాకుండా పాట పాడుతూ చివర్లో గట్టిగా మెగాస్టార్ అంటూ అరిచింది. ఈ విధంగా శ్రీముఖి గట్టిగా అరవడంతో సుమ కలుగజేసుకుని ఇంట్లో పెసరట్టు ఉప్మా వేసుకుంటున్న చిరంజీవి గారు భయపడి ఉంటారని సరదాగా తెలియజేశారు.
అందుకే శ్రీముఖి పై బాలయ్య ఆగ్రహం:
ఈ సాంగ్ గెస్సింగ్ గ్రౌండ్ లో భాగంగానే మరొక పాటను గెస్ చేయాల్సిందిగా సుమా అడిగారు.ఈ పాటను కూడా కరెక్ట్ గా గెస్ చేస్తూ బాలకృష్ణ పాటలు పాడుతూ … పైసావసూల్ సినిమాలో బాలకృష్ణ చేసిన డాన్స్ ను అచ్చం అతని బాడీ లాంగ్వేజ్ ని అనుసరిస్తూ చేసింది. మెగాస్టార్ అని గట్టిగా అరిస్తే పెసరట్టు వేసుకుంటున్నారు గాని, బాలకృష్ణ మాత్రం నీపై కత్తి నూరుతున్నారట అని మరో సారీ శ్రీముఖి పై సెటైర్ వేశారు. కోపం వస్తే చిరంజీవి పెద్దగా పట్టించుకోకపోయినా, బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి కోపం వస్తే నీ పని గోవిందా అంటూ సుమ శ్రీముఖిని హెచ్చరించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!