SSMB29: జపాన్ దేశంలో ఎస్.ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. విషయంలోకి వెళ్తే 2022లో ఆయన దర్శకత్వంలో వచ్చిన “RRR” సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఈ సినిమాని జపాన్ దేశంలో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో జపాన్ లో రజనీకాంత్ క్రియేట్ చేసిన “ముత్తు” రికార్డులను “RRR” బ్రేక్ చేయడం జరిగింది. “RRR” కి జపాన్ దేశం ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. జపాన్ లో సినిమా ఘన విజయం సాధించటంతో ఓ స్పెషల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రాజమౌళి హాజరయ్యారు.
భారీ ఆడిటోరియంలో కొన్ని వందల మంది అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జపాన్ దేశ ప్రజలు రాజమౌళి పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజమౌళికి ఘన స్వాగతం లభించింది. జపాన్ కి ఆయన రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై అభిమానాన్ని మిమ్స్ రూపంలో చాటారు. ట్విట్టర్ లో రాజమౌళి ట్రెండింగ్ గా నిలిచారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజమౌళి.. జపాన్ దేశంలో “RRR” సినిమా విజయం గురించి ఆనందం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేయబోయే “SSMB29” గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక సినిమా క్యాస్టింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కేవలం హీరో ఒక్కరే లాక్ అయ్యారు. అతడే మహేష్ బాబు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహేష్ చాలా హ్యాండ్సం గా ఉంటారు. ఆయన మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి జపాన్ లో కూడా రిలీజ్ చేస్తామని రాజమౌళి కీలక అప్ డేట్ ఇవ్వటం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!