షకలకబేబీ.. షకలక బేబీ.. అంటూ దక్షిణాది యువతను ఉర్రూతలూగించిన మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. 2010లో ‘నో ప్రాబ్లమ్’ అనే సినిమాతో సినిమాలకు కామా పెట్టిన ఈ అమ్మడు.. వచ్చే ఏడాది నుంచి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతోంది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది. అర్జున్ నటించిన ఒకేఒక్కడు సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించిన సుష్మిత.. ఆ తర్వాత నాగార్జున నటించిన ‘రక్షకుడు’ సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలీవుడ్లో అయితే బోలెడన్నీ కమర్షియల్ సక్సెస్లు అందుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్ ఎలా ఉండనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
previous post
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!