Trinayani April 24 2024 Episode 1221: దీన్నిబట్టి మీకేం అర్థమైంది అని సుమన అంటుంది. నీకు పిచ్చ అని అర్థమైంది అని విక్రాంత్ అంటాడు. ఇంతలో నైని కి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. నీవల్ల వదినకి కళ్ళు తిరుగుతున్నాయి చూడు అని విక్రాంత్ అంటాడు. నావల్ల మా అక్కకు కళ్ళు తిరగలేదు పూజలని ఉపవాసాలు ఉండడం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి అని సుమన అంటుంది. సుమన నైని కి జ్యూస్ తెచ్చి ఇవ్వు అనే విశాల్ అంటాడు. నాకన్నా మాకే బాగా చేస్తుంది బావ గారు అని సుమన అంటుంది. పర్వాలేదులే బాబు గారు అని నైని అంటుంది. కట్ చేస్తే,గాయత్రి పాపకి పౌడర్ రుద్దుతూ ఉంటాడు.ఇంతలో పావన మూర్తి డమక్క అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఏమి లేదు చూస్తున్నావుగా అని వల్లభ అంటాడు.
పాప మొహానికి పౌడర్ రుద్దుతున్నారు ఎందుకు అని పావని మూర్తి అంటాడు.ఏదో బలంగా కోరుకున్నట్టున్నారు అని డమ్మక్క అంటుంది.ఏం చేయాలనుకుంటున్నారు అని పావనమూర్తి అడుగుతాడు.ఫోటో కూడా రుద్దుతున్నారు చూడు అని డమ్మక్క చెబుతుంది. మనం ఇలా అడిగితే చెప్పరుని పావన మూర్తి అందరినీ పిలుస్తాడు.అందరూ పరిగెత్తుకొస్తారు.ఏమైంది మామయ్య ఎందుకలా అరిచావు అని విక్రాంత్ అంటాడు.పాప మొహానికి పౌడర్ రుద్దుతున్నారు అని హాసిని అంటుంది.ఎందుకలా చేస్తున్నావ్ అత్తయ్య అని నైని అడుగుతుంది. ఎన్నిసార్లు గాయత్రి అక్క జడ తెలుసుకోవాలని మనం ప్రయత్నించిన తెలుసుకోలేకపోతున్నాం. ఏదో ఒక ఆటంకం వస్తుంది అందుకనే గురువుగారిని సంప్రదించాం అని తిలోత్తమ అంటుంది.ఏంటి ఆ అఖండ స్వామి ఏం చెప్పాడు అని విక్రాంత్ అంటాడు. ఏముంది ఏదో తలకు మాసిన సలహా ఇచ్చి ఉంటాడు అని హాసిని అంటుంది. పనికొచ్చే పని నైని అని తిలోత్తమ అంటుంది.
ఏదో స్వామిని కలిశారనిమీ ఇష్టం వచ్చినట్టు చేస్తేఎలా ఆ విషయం మాకు చెప్పాలి కదా చిన్నపిల్లల మొహానికి అలా పౌడర్ వృత్తితే ఏమైనా అయితే ఎలా అని నైని అంటుంది. అది ఉట్టి పౌడర్ చెల్లి ఏమీ కాదు అని హాసిని అంటుంది. అమ్మ చిన్నపిల్ల కి ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారుఇలాంటి పిచ్చి పౌడర్లు రుద్దితే దానికి ఏమైనా అయితే ఎలా అని విశాల్ అంటాడు.నిన్ను కన్న తల్లి జాడ తెలుసుకోవాలని లేదా విశాల్ అని తిలోత్తమ అంటుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి అని నైని అడుగుతుంది. ఏమీ లేదు నైని మనం ఏ పని చేసినా ఆటంకం వస్తుందని గురువుగారిని అడిగితే గాయత్రి అక్క జాడ తెలుసుకోవడానికి ఒక పౌడర్ ఇచ్చాడు ఆ పౌడర్ని గాయత్రి అక్క పటానికి రుద్ది గాయత్రి మొహానికి అద్దంలోకి చూస్తే గాయత్రి అక్క చెడ తెలుస్తుంది అని తిలోత్తమ అంటుంది. ఆ మాట అనగానే పావనుమూర్తి పకపకా నవ్వుతాడు. ఎందుకు బాబాయ్ నవ్వుతున్నావ్ అని నైని అడుగుతుంది. గాయత్రి పాప అందులో చూస్తే తనే కదా కనపడుతుంది అని పావన మూర్తి అంటాడు.
అదే కదా బాబాయ్ నేను చెప్పేది కనిపించినా వాళ్లు తెలుసుకునే అంత పరిజ్ఞానం వాళ్ళకి లేదు అని హాసిని అంటుంది. బాబు గారు వాళ్ళు మంచి పని చేస్తాం అంటున్నారు కదా అది మంచి కాకపోతే అత్తయ్య బావగారు అని కూడా చూడను అని నైని అంటుంది. మా అక్కకికోపం వచ్చేస్తుంది అని సుమన అంటుంది. అరే ఈ అద్దంలోకి గాయత్రి పాప చూస్తే కనపడుతుంది అని వల్లభ అంటాడు.ఏంటి ఈ అర్థం లోక ఎంత చూసినా ఏమీ కనపడదు అని విక్రాంత్ అంటాడు. రేయ్ దీనికి బూడిద పూసమ్ రా అని తిలోత్తమ అంటుంది. గాడిదలు వచ్చి దొర్లుతాయని పూసరేమో బాబాయ్ అని హాసిని అంటుంది. వ్వలేదు చేస్తాం అంటున్నారు కదా చేయనివ్వండి అక్క అని సుమన అంటుంది.గాయత్రి పాపని వల్లభ ఎత్తుకొని అద్దంలోకి చూడమని అంటాడు. తిలోత్తమ అదని పట్టుకొని బూడిదని తుడుస్తుంది. అందులో హాసిని బూడిద పూసుకున్నట్టు కనపడుతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు.
వదిన కనపడుతుంది ఏంటి అని విక్రాంత్ అంటాడు. ఇది ఎలా కనపడుతుంది అని తిలోత్తమా షాక్ అయిపోయి నోరెళ్ళ పెట్టి చూస్తుంది. అసలు ఇది ఎలా కనపడుతుంది మమ్మీ అని వల్లభ అంటాడు.ఇందాకడి నుంచి నేను అదే కదా చెప్పేది అని హాసిని అంటుంది.ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర వేరు అద్దంలో కట్టుకున్న చీర వేరు అక్క అని సుమన అంటుంది.ఏమీ అర్థం కావట్లేదు మమ్మీ అని వల్లభ అంటాడు. నాకు అర్థమైందిరా ఇది మనం తెచ్చిన పౌడర్ కొట్టేసింది అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే. హాసిని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. తల్లి కొడుకులు రహస్యంగా డోర్ వేసుకుని ఏం మాట్లాడుకుంటున్నారు అని హాసిని తొంగి చూస్తుంది. మమ్మీ గాయత్రి పాపని తీసుకొచ్చి ఇప్పుడే పౌడర్ రుద్దుతామ అని వల్లభ అంటాడు. ఇప్పటికే ఆ పిల్ల తెల్లగా ఉంటుంది ఈ పౌడర్ రుద్దితే దడుచుకొని చస్తావ్ రేపు పొద్దున చూద్దాంలే వెళ్ళు అక్కడ దాచిపెట్టు పౌడర్ అని తిలోత్తమ అంటుంది.ఏమి వినిపించట్లేదని డోరుని ఒక తన్ను తన్నుతుంది హాసిని. భయపడి పోయి దాక్కుంటాడు వల్లభ. ఎవరొచ్చారు మమ్మీ అని వల్లభ అంటాడు
నీ భార్య వచ్చింది రా రా అని తిలోత్తమ అంటుంది. నీ కాలు దించవే చూడలేక చస్తున్నావ్ నీ ఫోజు అని తిలోత్తమ అంటుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే అని వల్లభ అంటాడు. అందరూ తిన్నారు మీరు ఇంకా లేట్ చేస్తే నేను పడుకుంటాను అప్పుడు అన్నం పెట్టను రండి డిన్నర్ చేతులు అని హాసిని అంటుంది. దానికి పిలిస్తే సరిపోతుంది కదా డోర్ ని తన్నుకొని మరీ రావాలా అని తిలోత్తమ అంటుంది. మీరు ముందు వస్తారా రారా లేదంటే అందర్నీ పిలుస్తాను మీరేదో డోర్ ఏసుకొని గూడుపుఠాని చేస్తున్నారని అని హాసిని అంటుంది. ఈ తింగరి దానితో పెట్టుకుంటే మనం రేపు పొద్దుగాల పని చేయలేము రారా డిన్నర్ చేద్దాం అని ఎత్తినొత్తమ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏదో చేస్తున్నారు అని హాసిని అంతా దేవులాడుతుంది. అక్కడ ఒక బౌల్ ఉంటే అది పట్టుకుని చూస్తుంది హాసిని.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది