Trinayani February 27 2024 Episode 1174: డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారో కనిపించలేదు కానీ ప్యాసింజర్ సీట్లో మాత్రం గాయత్రి పాప ఉంది బాబు గారు అని కంగారు పడుతుంది. నైని పాప కారులో ఎలా ఉంటుంది అని విశాల్ అంటాడు. తెలియదు కానీ బాబు గారు పాపు మాత్రం కారులో ఉంది అత్తయ్యకు కార్ తోటి యాక్సిడెంట్ అవుతుంది ఎలాగైనా సరే తనని కాపాడాలి అని నైని అంటుంది. అమ్మ వాళ్ళని రేపు బయటికి వెళ్లకుండా చూసుకుంటే సరిపోతుంది నువ్వు కంగారు పడకు మంచి నీళ్లు తాగు నైని అని విశాల్ నైనికి మంచినీళ్లు ఇస్తాడు. పెంచిన తల్లిని కడతేర్చాలని అమ్మ అనుకుంటుంది కానీ డ్రైవింగ్ సీట్లో ఎవరు ఉన్నారు అని ఎలా తెలుసుకోవాలి అని విశాల్ ఆలోచిస్తాడు. కట్ చేస్తే, సుమన కాఫీ తెచ్చి విక్రాంత్ కి తాగమని ఇస్తుంది.
పట్టుకుంటే పది కోట్లు అని విక్రాంత్ పేపర్లో చదువుతాడు. పట్టుకుంటే పది కోట్ల ఏం పట్టుకోవాలి అని సుమన అడుగుతుంది. అరుదైన వస్తువును పట్టుకుంటే 10 కోట్లు అంట అని విక్రాంత్ అంటాడు. పామును పట్టుకుంటే పది కోట్లు ఇస్తానంటే బాగుండేది నాగయ్యను పెద్ద బొట్టమ్మను పట్టించేదాన్ని అని సుమన అంటుంది. ఇంకా నయం ఉలోచిని ఇస్తాను అనలేదు అని విక్రాంత్ అంటాడు. పది కోట్లకే ఎందుకిస్తాను పాతి కోట్లు ఇస్తే ఇచ్చేదాన్ని ఎందుకంటే అది పుట్టకముందే రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నాను అని సుమన అంటుంది. 10 కోట్లు వస్తాయంటే బిడ్డను కూడా అమ్మకానికి పెట్టావు చూడు నువ్వు అసలు తల్లివేనా నేనే ఏదో ఒకటి చేయాలి అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,ఎక్కడికి వెళ్తున్నారు అని హాసిని తిలోత్తమని అడుగుతుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదని నీకు తెలియదా అని తిలోత్తమ అంటుంది. హాసిని ఎందుకు వదిన వాళ్ళను ఆటపట్టిస్తావు అని దురంధర అంటుంది.
ఇంతలో నైని విశాల్ అక్కడికి వస్తారు. ఏం జరిగింది అక్క అని నైని అడుగుతుంది.అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్తున్నారు చెల్లి వెళ్ళొద్దని చెబుతున్నాను అని హాసిని అంటుంది. ఎందుకు వెళ్ళోద్దు అని వల్లభ అంటాడు. ఈరోజుకి ఇంట్లోనే ఉండండి బావ గారు ఎక్కడికి వెళ్ళకండి అని నైని అంటుంది. ముఖ్యమైన పనులు ఉన్నాయి వెళ్లాలి అని తిలోత్తమ అంటుంది. ఎందుకు వెల్లోద్దు చెప్తే కదా నైని తెలిసేది అని విశాల్ అంటాడు. ఏంటది చెప్పండి అని తిలోత్తమ అంటుంది. నేను చెప్పనా అని హాసిని అంటుంది. చెప్పడానికి ఒకరు పర్మిషన్ అక్కర్లేదు చెప్పు హాసిని అని తిలోత్తమ అంటుంది. నీకు ప్రాణగండం ఉంది అందుకే చెల్లి వెళ్లొద్దని చెప్తుంది అని హాసిని అంటుంది. అక్క చెప్పొద్దన్నాను కదా అని నైని అంటుంది.
అత్తయ్యను కూడా చంపేయాలనుకుంటున్నావా అని సుమన అంటుంది. సుమన అమ్మ వాళ్లకి తెలియకుండా కాపాడాలి అనుకుంది నైని అని విశాల్ అంటాడు. గండం వస్తుందని చెప్పారు కానీ ఎవరి వల్ల వస్తుందో చెప్పలేదు అని తిలోత్తమ అంటుంది. గాయత్రీ దేవి అని హాసిని అంటుంది. వదిన అమ్మ పేరు చెప్తావ్ ఏంటి అని విశాల్ అంటాడు. గాయత్రి వదిన తిలోత్తమని చంపేస్తుందా అని దురంధర అంటుంది. గాయత్రి కాదు పాప అని హాసిని అంటుంది.అయితే నేను వెళ్తున్నాను కాబట్టి మమ్మీకి ఎటువంటి గండం రాదు అని వల్లభ అంటాడు. వన్ ప్లస్ ఆఫర్ గిఫ్ట్ లోనే కాదు రాజా చావులో కూడా ఉంటుంది అని హాసిని అంటుంది. అది ఎవరు పెట్టారు అక్క అని సుమన అడుగుతుంది. నీ మొగుడు నా మొగుడు కాదు చెల్లి యముడు పెట్టాడు అని హాసిని అంటుంది. పిచ్చి నా పెళ్ళామా నేను వెళ్తున్నాను అంటే మా మమ్మీకి ఎటువంటి ఆపద రాదు ఎందుకంటే నేను డ్రైవింగ్ చేస్తాను కదా నాకు ఏమీ కాదంటే మమ్మీకి ఏమి జరగదనే కదా అర్థం అని వల్లభ అంటాడు.
అలాగని వెంట వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు బావగారు అని నైని అంటుంది. మా అమ్మ గండానికి జూనియర్ శాస్త్రి మనవరాలుకి ఏమైనా సంబంధం ఉందా మరదలా అని వల్లభ అంటాడు. అన్నయ్య నేను చెప్పింది వినొచ్చు కదా అని విశాల్ అంటాడు. ఎవరి మాట వినరు బ్రో అని అని విక్రాంత్ అంటాడు. ఈరోజు అత్తయ్య వాళ్లకు మా అక్క చెప్పినట్టు జరగక పోతే ఎవ్వరు తన మాట నమ్మరు అని సుమన అంటుంది. గాయత్రి పాపని గదిలో పెట్టాను తను గదిలో ఆడుకుంటుంది కానీ మీరు బయటికి వెళ్లొద్దు అత్తయ్య అని నైని అంటుంది.అందుకే కదా కారు బుక్ చేసుకొని వెళ్తాం అంటున్నాం అని తిలోత్తమ అంటుంది.పెద్ద వదిన వచ్చి తిలోత్తమ వదినని చంపేస్తుందా అని దురంధర ఉంటుంది. మమ్మీ మనం వెళ్దాం పద అని వల్లభ అంటాడు. ఈ ఒక్క రోజుకి ఇంట్లో ఉండండి బావగారు అని నైని అంటుంది. నైనీ గాయత్రి అక్క పునర్జన్మ ఎత్తి ఇంటికి వస్తే భయపడాలి కానీ గాయత్రి పాపకి ఎందుకు భయపడాలి తను మమ్మల్ని ఎలా చంపుతుంది అని తిలోత్తమ వల్లభ నవ్వుతారు. చావంటే ఎగతాళిగా ఉందా అని విశాల్ అంటాడు.
వెళ్ళిపోయాక మన ఏడుపులు చూడాలనుకుంటున్నారేమో విశాల్ అని హాసిని అంటుంది. పిచ్చి హాసిని చెప్పిన నమ్మేలా ఉండాలి గాయత్రి పాపని గదిలో పెట్టానని నైని చెప్పింది ఇక మాకు ఎలా ప్రమాదం జరుగుతుంది మేము క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం క్యాబ్లోకి ఎలా వస్తుంది మనం వెళ్దాం పద అని తిలోత్తమ వల్లభ బయటికి వస్తారు. కట్ చేస్తే, నైని చెప్పింది జరుగుతుందో లేదో కానీ డ్రైవర్ లేని కారు మనమీదికి ఎలా దూసుకు వస్తుందో చూడాలని ఉందిరా అని తిలోత్తమ అంటుంది.ఇంతలో గాయత్రి పాప బయటికి వెళ్లడానికి డోర్ దగ్గరికి వస్తుంది. నాగయ్య వచ్చి డోర్ ని ఓపెన్ చేస్తాడు. గాయత్రి పాప కిందికి వస్తుంది. క్యాబ్ బుక్ చేశాను ఇంకా రాలేదేంటి అని వల్లభ అంటాడు. అరేయ్ సరిగా బుక్ చేసావా లేదా చూడు అని తిలోత్తమ అంటుంది. ఏంటి మమ్మీ డ్రైవర్ వచ్చి నిన్ను గుద్దేసి ప్రాణాలు తీస్తాడని భయపడుతున్నావా అని వల్లభ అంటాడు. నీ పిచ్చి నవ్వు పక్కన పెట్టి క్యాబ్ బుక్ చేయరా మళ్లీ అని తిలోత్తమ అంటుంది.వాళ్ళిద్దరూ క్యాబ్ కోసం రోడ్డుమీద వెయిట్ చేస్తూ ఉంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!