Vaishnav Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోగా ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో గుర్తింపును సంపాదించుకున్నారు. తాజాగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం రాబడుతున్నారు. వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమానే ఎంతో ఘన విజయాన్ని సాధించడంతో ఈ మెగా హీరోకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పెన సినిమా తరువాత వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున కూడా హీరోగా సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి త్వరలోనే నాగార్జున అధికారిక ప్రకటన చేయనున్నారు.
మొదటి సినిమాతోనే ఎన్నో అవకాశాలు దక్కించుకున్న వైష్ణవ్ తేజ్ కి ప్రస్తుతం మరో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్) ద్వారా దర్శకుడిగా పరిచయమైన గిరీషయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఓ సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకులైన సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన గిరీషయ్య ఆదిత్య వర్మ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తాజాగా ఈ దర్శకుడు మెగా హీరోకు కథ చెప్పడంతో అందుకు మెగా హీరో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు:
ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఉప్పెన సినిమా ద్వారా దర్శకుడిగా మారారు.తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమానే సంచలన విజయం సృష్టించడంతో ఉప్పెన సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ డైరెక్టర్ బుచ్చిబాబుకి కారును బహుమతిగా ఇచ్చారు. నిర్మాతలు ఇచ్చిన ఆ కారులో తన గురువు సుకుమార్ ను ఫస్ట్ రైడ్ కి తీసుకెళ్లారు. మొదటి సినిమాతోనే ఇంతటి విజయాన్ని అందించిన హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న రెండవ సినిమాకి కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మొత్తానికి మెగాహీరో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పవచ్చు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!