Pushpa: 2021లో విడుదలైన “పుష్ప” సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన ప్రతి దానికి సినిమా ప్రేక్షకులు భాషతో, దేశాలతో.. ప్రాంతాలతో సంబంధం లేకుండా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా “పుష్ప” డైలాగులు మేనరిజం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తగ్గేదెలే డైలాగ్ అందరిని ఆకట్టుకోవటం జరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాకి గాని ఇటీవల ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా అల్లు అర్జున్ గెలవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమాలో “పుష్ప” పక్కన కేశవ పాత్రలో నటుడు జగదీష్ నటన సినిమాకి హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ పక్కనే జగదీష్ సినిమాలో దాదాపు సగానికి పైగా ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ నటుడు జగదీష్ నీ హైదరాబాదులో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఓ జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉండగా ఫోటోలు తీసి జగదీష్ బెదిరింపులకు పాల్పడిన అభియోగంపై కేసు నమోదు చేయడం జరిగింది. పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న మహిళ జగదీష్ వేధింపుల నేపథ్యంలో నవంబర్ 29వ తారీఖున ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో గత నెల 27న బాధిత మహిళ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో జగదీష్ ఫోటోలు తీయడం జరిగిందట. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగడంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితురాలు… ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందట.
ఈ ఘటన జరిగిన వెంటనే కేసు నుంచి తప్పించుకుని తిరుగుతున్న జగదీష్ నీ డిసెంబర్ ఆరోవ తారీకు బుదవారం పోలీసుల అరెస్టు చేసి.. రిమాండ్ కి తరలించారు. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో రెండో భాగం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు విడుదల చేస్తున్నట్లు కూడా అధికారికంగా తేదీ ప్రకటించారు. ఈ పరిస్థితులలో నటుడు జగదీష్ అరెస్ట్ “పుష్ప” సినిమా యూనిట్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయిందట.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!