Munugodu By Poll: మునుగోడు ఉప ఎన్నికల ప్రదాన రాజకీయ పక్షాల మధ్య రణరంగంగా మారింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ విజయమే లక్ష్యంగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నేతలపై వ్యక్తిగత విమర్శల దాడి సాగుతోంది. ఈ క్రమంలోనే చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్ధం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఎన్నికల ప్రచారం కోసం తెప్పించిన సుమారు రూ.5లక్షల ప్రచార సామాగ్రిని చుండూరు పార్టీ కార్యాలయంలో భద్ర పర్చగా, సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మంటలు ఎగిసి పడటంతో అప్రమత్తమైన కార్యకర్తలు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో పక్క బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా చుండూరు మండల కేంద్రంలో రాత్రికి రాత్రికి అంటించిన వాల్ పోస్టర్ లు తీవ్ర కలకలాన్ని రేపాయి. ఫోన్ పే తరహాాలో కాంట్రాక్ట్ పే అంటూ వేల పోస్టర్ ను ప్రత్యర్ధులు రాత్రికి రాత్రే అంటించారు రాత్రికి రాత్రే కొందరు ఏర్పాటు చేసిన పోస్టర్లు దుమారాన్ని రేపుతున్నాయి. రూ.18వేల కాంట్రాక్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కేటాయించడం జరిగిందంటూ BJP18THOUSANDCRORES అనే ట్రాన్స్ క్షన్ ఐడీని ఫోన్ పే తరహాలో పోస్టర్ లో ప్రింట్ చేశారు. పైగా 500 కోట్ల బోనస్ సంపాదించారంటూ పోస్టర్ లో పొందుపర్చారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకలాన్ని రేపుతుండగా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రచార సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయడం హాట్ టాపిక్ గా మారింది.