YS Sharmila : తెలుగు రాజకీయాలలో మాత్రమే కాక జాతీయ స్థాయిలో షర్మిల YS Sharmila కొత్త పార్టీ న్యూస్ కలకలం రేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం కోసం పాటుపడుతున్నట్లు, అందుకోసం గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కార్యకర్తలు ఏమనుకుంటున్నారు… వారి అభిప్రాయాలు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని షర్మిల మీడియాతో తెలపడం జరిగింది. ఇదే తరుణంలో కచ్చితంగా తెలంగాణలో మళ్లీ “రాజన్న రాజ్యం” తీసుకొస్తామని స్పష్టం చేయడం జరిగింది. మొత్తంమీద షర్మిల దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొత్త పార్టీ పెట్టడం ఖాయం అనే టాక్ బలంగా వినబడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారీగా వైసిపి అభిమానులతో అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి తో పనిచేసిన వారందరితో ప్రత్యేకంగా మీటింగ్ లు పెట్టడానికి ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు రావటం అందరికీ తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉండగా జాతీయ స్థాయి లో కొంతమంది కీలక నేతలు ముఖ్యంగా బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఈ వార్త తెలుసుకుని షర్మిల కి మద్దతు తెలపడానికి భారీఎత్తున ఫోన్లు చేస్తున్నారట, అయితే షర్మిల మాత్రం ఎక్కడా కూడా ఎవ్వరికీ అందకుండా జాతీయ ఉచ్చులో చిక్కుకోకుండా రాష్ట్రస్థాయిలో పార్టీ ఏర్పాటు, నిర్మాణంపై దృష్టి పెట్టడానికి రెడీ అయినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన చాలా మంది ఈ వార్త తెలుసుకుని…కీలక సమయంలో తెలంగాణ రాజకీయాలు షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని.., ప్రారంభంలో కచ్చితంగా జాగ్రత్తగా, రాజకీయ అడుగులు వేస్తే పొలిటికల్ గా భవిష్యత్తు ఉంటుందని అంటున్నారట. టిఆర్ఎస్ ఉప ఎన్నికలలో ఓడిపోవటం అదేవిధంగా, కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా పడిపోవటం ఇక బిజెపి రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో.. షర్మిల రైట్ టైం లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని భావిస్తున్నారు.