అమరావతి, జనవరి 12: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి కేసులో కొత్త మలుపు. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఎ అధికారులు విచారణ నిమిత్తం ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియజెప్పాలంటూ ఆతని తరపు న్యాయవాది సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడిని వారం రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతితో ఎన్ఐఎ అధికారులు శనివారం ఉదయం అతన్ని విజయవాడ జైలు నుండి కస్టడిలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని, థర్డ్ డిగ్రీ ఉపయోగంచకూడదని కోర్టు షరతులు విధించినప్పటికీ ఎన్ఐఎ అధికారులు మాత్రం నిందితుడి తరపు న్యాయవాదికి ఎటువంటి సమాచారం లేకుండా రహస్య ప్రదేశానికి తరలించారు. దీనిపై న్యాయవాది అబ్దుల్ సలీం సెషన్స్ కోర్టులో శనివారం సాయంత్రం పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు శ్రీనివాసరావును ఎక్కడికి తీసుకువెళ్లారో సమాచారం ఇవ్వాలని కోరారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఉన్నా తమకు సమాచారం ఇవ్వకుండా రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి విచారణ చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
previous post