ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించింది. మే 29వ తేదీన హైకోర్టు ఆదేశాల ప్రకారం తాము ఈ నియామకాన్ని చేపడుతున్నామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం తరపున గవర్నమెంట్ ప్రధాన సెక్రటరీ అయిన గోపాలకృష్ణ ద్వివేది ఈ రకంగా ఉత్తర్వులను జారీ చేశారు.
కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు అన్న కారణంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క పదవీకాలాన్ని ఉన్నట్టుండి కుదించివేసిన ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అటు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించి మళ్లీ నిమ్మగడ్డ నియామకం చేపట్టాలని ఆదేశించగా…. వారు ఆ మాటలను వినకపోయేసరికి చివరికి విషయం గవర్నర్ వరకు వెళ్ళింది. గవర్నర్ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన నిర్ణయం ప్రకటించడంతో అనివార్య పరిస్థితుల్లో వారు తిరిగి నిమ్మగడ్డను ఇలా నియమించాల్సి వచ్చింది.