అలీబాగ్: పంజాబ్ నేషనల్ బ్యాంక్కు 13వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదికి చెందిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు.
మహారాష్ట్రలోని ఆలీబాగ్లో నిబంధనలు ఉల్లంఘించి దాదాపు వంద కోట్ల రూపాయల వ్యయంతో 33వేల చదరపు అడుగుల భవన నిర్మాణం చేశారు. భవనం పటిష్టంగా ఉండటంతో బుల్డోజర్లతో కూల్చడం కష్టమని భావించిన అధికారులు డైనమైట్లతో నేలమట్టం చేశారు.
రాయగడ్ జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశి పర్యవేక్షణలో శుక్రవారం భవనాన్ని కూల్చివేశారు.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సిఆర్జడ్) నిబంధనలను ఉల్లంఘించి సముద్రపు ముఖంగా ఈ భవనాన్ని నిర్మించారు.
భవనం కూల్చివేత కార్యక్రమం విజయవంతమయ్యిందని కలెక్టర్ సూర్యవంశి తెలిపారు.