Nivetha thomas : నివేతా థామస్ తాజాగా వచ్చి సునామీని సృష్ఠిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో వేముల పల్లవిగా నటించి ఆకట్టుకుంది. హిందీలో తాప్సీ పోషించిన ఈ పాత్రకి బాలీవుడ్ లో ఎంతటి పేరొచ్చిందో..అదే పాత్రని తెలుగు వకీల్ సాబ్ లో పోషించిన నివేతాకి అంతకి రెట్టింపు పేరొచ్చింది. వకీల్ సాబ్ సినిమా చూసిన మెగాస్టార్ ప్రత్యేకంగా నివేతా ని ప్రశంసించడం గొప్ప విషయం. ఇక ఈ సినిమా చూడాలన్న ఆతృత సామాన్య ప్రేక్షకుడి నుంచి మెగా స్టార్ వంటి ప్రముఖుల వరకు ఉండటం ఆసక్తికరం.
అలాంటి పవర్ స్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న నివేతా కి థియేటర్ లో జనాల మధ్య కూర్చొని చుడాలన్న ఆతృత ఇంకెంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే నివేతా థామస్ వకీల్ సాబ్ సినిమా చూసేందుకు థియేటర్ కి వచ్చింది. దీన్ని కొందరు తప్పు పడుతున్నారు. అందుకు కారణం నివేతా వారం రోజుల క్రితం కరోనా బారిన పడిందంటు సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. వకీల్ సాబ్ సినిమా ఒక రోజు ముందు కూడా వకీల్ సాబ్ సినిమా చూసేందుకు అందరూ మాస్కులు ధరించి రావాలంటూ కూడా పోస్ట్ చేసింది.
Nivetha thomas : పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమా కరెక్ట్ గా పడిందని చెప్పుకుంటున్నారు.
అయితే తనకి కరోనా నెగిటివ్ వచ్చిందా లేదా అన్న విషయం ఎక్కడా వెల్లడించకుండా ఇలా థియేటర్ కి రావడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడుకుంటున్నారట. అయితే నివేతా కి కరోనా నెగిటివ్ వచ్చి ఉండొచ్చు. అందుకే థియేటర్ వరకు వచ్చి ఉంటుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమా దేశ విదేశాలలో ఊహించని రేంజ్లో వసూళ్ళు రాబడుతూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమా కరెక్ట్ గా పడిందని చెప్పుకుంటున్నారు.