Padma Awards: భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డులను కేంద్రం గురువారం రాత్రి ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం వేళ పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఎంపిక చేసింది.
గురువారం రాత్రి ప్రకటించిన 132 పద్మ పురస్కారాల్లో 5 పద్మవిభూషణ్, 17 పద్మభుషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులకు ఈ పురస్కారాలు వరించాయి.ఇందులో అయిదుగురు తెలుగు వాళ్లు ఉండటం గర్వకారణం. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి లను పద్మశ్రీ అవార్డులు వరించాయి.
సాంప్రదాయకంగా పురషాధిక్య రంగంలో తన కంటూ ఒక స్థలాన్ని సృష్టించుకోవడానికి మూస పద్ధతులను అధిగమించిన భారతదేశపు తొలి మహిళా ఏనుగు మహోట్ పార్వతి బారును పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రకటించారు. అలాగే కళలు విభాగంలో బీహార్ కు చెందిన దంపతులు శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్ కు, త్రిపురకు చెందిన చక్కా రేఖాకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది.
Sajjala Rama Krishna Reddy: ఇది కరెక్టేనా .. షర్మిల వ్యాఖ్యలపై సజ్జల