తీవ్రవాద దేశంగా చెప్పబడే పాకిస్తాన్ లోనే తీవ్రవాదుల దాడి జరిగింది. కరాచీ లోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో సోమవారం ఉదయం మిలిటెంట్లు గ్రెనేడ్ లతో విధ్వంసం సృష్టించారు. కనీసం ఐదు మంది వరకూ చనిపోయి ఉండొచ్చని పాకిస్తాన్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందంట.
మొదట మిలిటెంట్లు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజి పై గ్రెనేడ్లు విసిరి దాడి చేశారు. అవి పేళిన తర్వాత విపరీతమైన అగ్ని చెలరేగగా లోనికి వెళ్లి లోపల ఉన్న వారిని హతమార్చేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతానికి పాకిస్తాన్ పోలీసులు లోపల ఉన్న జనం మొత్తాన్ని బయటకు పంపి చేసి నలుగురు మిలిటింట్లను హతమార్చినట్లు సమాచారం. ఇంకా ఒక టెర్రరిస్టు ప్రాణాలతో తిరుగుతున్నాడట.
ఇకపోతే ఈ దాడిలో ఒక పోలీస్ ఆఫీసర్ మరియు స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీ గార్డు ప్రాణాలతో పోరాడుతున్నారు. దాడి చేసిన మిలిటెంట్ల దగ్గర చాలా అధునాతనమైన ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఒక బ్యాగ్ నిండుగా పేలుడు పదార్ధాలున్నాయని మీడియా చెబుతోంది.
కొంచెం ఆలస్యం చేసి ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని పోలీసు వర్గాల నుంది సమాచారం. మొత్తానికి గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. ఇక టెర్రరిస్టులకు ఆశ్ర్యం ఇచ్చి, పెంచి పోషించి అంతే కాకుండా వారిని తయారు చేస్తుంది అన్న ముద్ర ఉన్న వారి దేశంలో టెర్రరిస్టులు ఈ అటాక్ కు పాల్పడడం నిజంగా షాకింగ్ అని చెప్పాలి.