రాజస్థాన్, మార్చి 11 : రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో పాక్ డ్రోన్ను ఆదివారం భారత సరిహద్దు భద్రతా దళాలు కూల్చివేశాయి. బాల్ కోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడుల అనంతరం భద్రతా దళాలు పాక్ డ్రోన్ను కూల్చివేయటం ఇది నాల్గొవసారి.
‘ఎదో ఒక వస్తువు ఇంటి పైభాగంలో పడినట్లు మాకు సమాచారం అందింది. మేము వెంటనే ఆర్మీ , భద్రతా దళాలకు సమాచారం అందించాం. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు’ అని శ్రీగంగానగర్ పోలీస్ అధికారి ఇస్మాయిల్ ఖాన్ తెలిపారు.
మొదటిసారి ఫిబ్రవరి 26న పాక్ డ్రోన్ గుజరాత్లోని కచ్ సరిహద్దు వెంబడి ఉన్న నలియా స్థావరం సమీపంలోకి ప్రవేశించగా సైన్యం దాన్ని కూల్చివేసింది. రెండొవసారి మరో పాక్ డ్రోన్ మార్చి నాలుగున రాజస్థాన్లోని బికనీర్ సెక్టార్లోకి ప్రవేశించగా భద్రతా బలగాలు సుఖోయ్-30 యుద్ధ విమానంతో కూల్చివేశాయి.
మూడొవసారి ఇంకొక పాక్ డ్రోన్ మార్చి తొమ్మిదిన రాజస్థాన్లోని శ్రీగంగానగర్ సెక్టార్లోకి ప్రవేశించగా భద్రతా దళాలు కూల్చివేశాయి.