Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Pawan Kalyan తాజాగా పంచాయతీ ఎన్నికల నుద్దేశించి కీలక ప్రకటన విడుదల చేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో పెద్దఎత్తున ఓట్లు మరియు సీట్లు రాబట్టినట్లు స్పష్టం చేశారు. ఇదంతా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు కృషి వల్లే పార్టీ ఈ రీతిలో రాణి ఇచ్చినట్లు స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల ఫలితాలు ఎంతో సంతృప్తిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాజా ఫలితాలు బట్టి ప్రజలలో మార్పు స్టార్ట్ అయిందని దానికి నిదర్శనమే ఫలితాలు అని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ తరుపున ప్రకటన విడుదల చేయడం జరిగింది. తొలి విడత పంచాయతీ ఫలితాలు సంతృప్తినిచ్చాయని పవన్ పేర్కొన్నారు.
జనసేన భావజాలంతో పోటీలో నిలిచి, పార్టీ శ్రేణుల మద్దతు పొందిన వారు 18 శాతానికిపైగా ఓట్లు సాధించి గణనీయంగా సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు కైవసం చేసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. దాదాపు 1700 పైగా పంచాయతీలో జనసేన పార్టీ రెండో స్థానంలో నిలవటం నిజంగా హర్షించదగ్గ విషయమని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు. మామూలుగా పంచాయతీ ఎన్నికలు అంటే అధికార ప్రతిపక్షాలు అనుకూలంగా ఉంటాయి, కానీ తాజా ఫలితాలు పార్టీకి అనుకూలంగా రావటం పరిస్థితులు మారడం చూస్తే కచ్చితంగా ప్రజలలో మార్పు వచ్చినట్లు స్పష్టం గా ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీకి అండగా నిలబడి పని చేసిన ప్రతి కార్యకర్తకు మరియు నాయకులకు ఆడపడుచులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ వచ్చే మూడు దశల్లో ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పవన్ స్పష్టం చేశారు.