Petrol price: దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు నానాటికి పెరుగుతున్నాయి. మునుపెన్నడు లేని రీతిలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లీటరు ధర వంద రూపాయల కు పైగా చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ ధర పెరుగు దల కారణంగా ఆ ప్రభావం రవాణా రంగంపై పడి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై విపక్షాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు.
Read more:Voluntaries: జగనన్నా చూస్తున్నారా..? వాలంటీర్లకు అవినీతి మరకలు..!!
అయితే ప్రజలకు ఊరట నిచ్చే మాట ఆ కేంద్ర మంత్రి చెప్పారు. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో దేశ ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ అందనుందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హార్దిప్ సింగ్ పూరి తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లోనే పెట్రో ధరల భారం నుండి ప్రజల కు ఉపశమనం లభించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా చమురు ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పెట్రో ధరల అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితమైన దిగా భావిస్తున్నట్టు చెప్పారు. అయితే ఇంధనాల పై సుంకాల పెంపు ను ఆయన సమర్థించుకున్నారు.
ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉచిత రేషన్, టీకా కార్యక్రమం, సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. 2010 ఏప్రిల్ లో నాటి ప్రభుత్వం పెట్రోలుపై ఎంత అయితే ఎక్సైజ్ సుంకం విధించిందో ఇప్పుడు అంతే మొత్తంలో తమ ప్రభుత్వం విధిస్తోందని చెప్పుకొచ్చారు. ఏది ఎలా ఉన్నా త్వరలో పెట్రోల్ ధరలు తగ్గనున్నా యంటూ కేంద్ర మంత్రి చెప్పటం వాహనదారుల కు ఊరటనిస్తుంది.