ఈశాన్య భారతం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మపుత్ర మీద నిర్మించిన ఈ వంతెన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు కీలకమైనది. దీని వల్ల వారి ప్రయాణ కాలం చాలా తగ్గుతుంది. వంతెన గురించిన కొన్ని ముఖ్యమైన వివరాలు.
- బ్రహ్మపుత్రా నదిపై 4.98 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మించారు. ఇది దేశంలోకెల్లా పొడవైన రైలు రోడ్డు వంతెన. ఆసియాలో రెండవ పెద్ద వంతెన.
- అప్పటి ప్రధాని హెచ్. డి. దేవెగౌడ 1997లో వంతెన నిర్మాణానికి శంఖుస్తాపన చేశారు. 2002లో అప్పటి ప్రధాని వాజ్పేయీ నిర్మాణాన్ని ప్రారంభించేవరకూ పని మొదలు కాలేదు.
- అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో దిబ్రూగఢ్కు 17 కిలోమీటర్ల దిగువన వంతెన నిర్మించారు. దిబ్రూగఢ్, ధేమజీ జిల్లా కేంద్రాల మధ్య ప్రయాణకాలం ఈ వంతన వల్ల నాలుగు గంటలు తగ్గుతుంది.
- ఈ వంతెనను పూర్తిగా వెల్డింగ్తో నిర్మించారు. ఇండియాలో ఇలాంటిది ఇంతకు ముందు నిర్మాణం కాలేదు. ఈ టెక్నాలజీ వల్ల వంతెన నిర్వహణ వ్యయం తగ్గుతుంది.
- వంతెన కింది భాగంలో రెండు లైన్ల రైల్వే ట్రాక్ ఉంటుంది. పై భాగంలో మూడు లేన్ల రోడ్డు మార్గం ఉంటుంది. వంతెన నిర్మాణానికి 5,900 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 30 లక్షల బస్తాల సిమెంట్, 19,250 మీటర్ల రీఇన్ఫోర్స్డ్ స్టీలు వంతెన నిర్మాణానికి పట్టాయి.
- దేశరక్షణలో కీలకమైన ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్కు సైన్యం, ఆయుధసామాగ్రి చేరవేత ఇకమీదట సులువుగా మారుతుంది.
- రిక్టర్ స్కేలుపై 7 వరకూ భూకంపాన్ని తట్టుకునే విధంగా వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మించిన ప్రాంతం తీవ్రమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతం.
బోగేబీల్ ప్రారంభోత్సవ వీడియోను వీక్షించాలంటే ఈ కింద క్లిక్ చేయండి