Jai Bhim: సమాజంలో అణగారిన వర్గాలు అనబడే దళితులకు అండగా ఉండే రీతిలో సూర్య నిర్మించిన జై భీమ్(Jai Bhim) సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాన పాత్రలో సూర్య(Surya) నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మతపరమైన అంశానికి సంబంధించిన సన్నివేశం పై వీక్షకులలోఒక వర్గం.. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. విషయంలోకి వెళితే జై భీమ్(Jai Bhim) చిత్ర నిర్మాత దర్శకుడు పై ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ…పీఎంకె(PMK) మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్కు వినతిపత్రం ఇచ్చారు. అదే రీతిలో వన్నియర్ కమ్యూనిటీని కించపరిచిన హీరో సూర్య(Surya)ని కోట్టిన వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తున్నట్లు పీఎంకే నేతలు తాజాగా ప్రకటించడం సంచలనంగా మారింది.
ఇదే రీతిలో జై భీమ్ సినిమా థియేటర్ల వద్ద తమిళనాడులో ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నారు. వివాదాస్పదమైన సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆందోళనలు చేస్తూ ఉన్నారు. జై భీమ్ సినిమాలో వన్నియర్ వర్గాన్ని.. కావాలని కించపరిచే రీతిలో.. సినిమా చేయడం జరిగిందని పి అంటే నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇదే వివాదంపై నటుడు సూర్య కు మాజీ కేంద్రమంత్రి అన్నుమని.. లెటర్ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో లెటర్ పై స్పందించిన సూర్య ఏ వర్గాన్ని.. కించపరచాలని ఉద్దేశం తమకు లేదని సమాజంలో దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలని ఉద్దేశం తోనే సినిమాలు నిర్మించి నట్లు వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ఆదివారంమైలాడుతురైలో నటుడు సూర్య సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బామాక ప్రజలు నిరసనకు దిగారు. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘం నోటీసు జారీ చేసింది. వివాదం ముదురుతోంది ఉండటంతో హీరో సూర్యా కి… చాలా మంది ప్రముఖులు మద్దతు తెలుపుతూ #WeStandWithSuriya అనే హ్యాష్ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు.