Prabhas భారతదేశపు మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు వేరే లెవెల్ కు చేరుకుంది. భారత దేశం లోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన సినీ నటుడు ప్రభాస్ కావడం విశేషం. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఎవరూ ఊహించని రేంజ్ కు ఎదిగిపోయాడు. ఇక ప్రభాస్ చేయబోయే తర్వాత సినిమాలన్నీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అధిక బడ్జెట్ పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఇక ఇతని బ్రాండ్ నమ్ముకొని ఎంత మంది నిర్మాతలు డబ్బులు పెడుతున్నారో అలాగే అతని పేరు చెప్పి కొంతమంది కిలాడీలు అమాయకులను మోసం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే…. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని అనేక మందికి కొంతమంది ఒక ముసుగు ప్రొడక్షన్ హౌస్ పేరుతో మస్కా కొట్టారు. అమాయకులకు బాహుబలి బిస్కెట్ వేసిన వీరు ఒక్కొక్కరి నుండి పది వేల రూపాయలకు పైగా వసూలు చేసి చివరికి మాయమయ్యారు. తాము ప్రభాస్ తో ఒక సినిమా నిర్మిస్తున్నామని ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోందని… కొత్త నటీనటులకి ఈ సినిమాలో అవకాశం ఉందని చెప్పి ఒక్కొక్కరి దగ్గర పదివేల రూపాయలు తీసుకొని వీరు… మీరంతా రిజిస్టర్ చేసుకున్నారు అని చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు పిలుచుకొని వెళ్తాం అని కూడా అన్నారు.
అంతే…. ప్రభాస్ పేరు వినగానే కొంతమంది సినిమా పిచ్చోళ్ళు 10 వేల రూపాయలకే అవకాశం చిక్కుతుంది అని ఆశపడ్డారు. అలా చాలా మంది చెల్లించారు. అయితే డబ్బులు చెల్లించి చాలా కాలం అయినా సినిమా ఛాన్స్ రాకపోవడంతో ఒక యువతి అనుమానం వచ్చి ముంబై పోలీసులు దగ్గరికి వెళ్ళింది. ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత మేము కూడా అదే బాపతి మహాప్రభో అంటూ మరికొందరు క్యూ కట్టారు .రాను రాను వారి సంఖ్య పెరిగిపోయింది. అంతే…. సినిమా పిచ్చోళ్ళను ఒక ప్రొడక్షన్ సంస్థ మోసం వెళ్లిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
Prabhas: ఆ పేరు చాలు…
ఇక ప్రభాస్ పేరు చెప్పగానే సినిమా ఏమిటి…? దర్శకుడు ఎవరు…? అన్న ప్రశ్నలు లేకుండా వీరంతా కళ్ళుమూసుకుని డబ్బులు కట్టడం విశేషం. సాధారణంగా ప్రముఖ ప్రొడక్షన్ సంస్థలు ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. డబ్బులు తీసుకొని మేము అవకాశాలు ఎప్పుడూ ఇవ్వము…. టాలెంట్ ఉంటేనే ఇస్తామని చెబుతుంటారు. అయితే ప్రభాస్ ఒక్కడి పేరు చూసి వీరు ఇలా ఎగబడడం చూస్తుంటే అతను ఏ రేంజ్ కు వెళ్ళాడో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ కాకుండా మరే హీరో పేరు వాదినా ఇటువంటిది చేయడం నిందితులకు సాధ్యపడేది కాదేమో.