Prabhas : పాన్ ఇండియా మెగాస్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. జపాన్ దేశంలో మిల్క్ బాటిల్స్ పై ప్రభాస్ ఫొటోలు ప్రచురించి ప్రచారం చేస్తున్నారు అంటే అతని క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి సినిమా తర్వాత ఆయన ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాతో అలరించడానికి ఆయన రెడీ అయ్యారు. అలాగే ఆదిపురుష్, సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పారితోషికం గురించి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది.
Prabhas : ఏంటి ప్రభాస్ ఒక్క సినిమాకి అంతా తీసుకుంటాడా
తెలుగు సినిమా చరిత్రలోనే కాదు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలోనూ.. ఎవరూ అందుకోలేని స్థాయిలో ప్రభాస్ పారితోషికం పుచ్చుకుంటున్నారు. విశేషమేంటంటే.. బాలీవుడ్ హీరోల కంటే మన తెలుగోడి రెమ్యునరేషన్ నే ఎక్కువ. తాజా సమాచారం ప్రకారం, ఆదిపురుష్ చిత్రం కోసం ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు పుచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఏ సినీ నటుడు కూడా ఇంత మొత్తంలో డబ్బులు తీసుకోలేదు. అయితే ఈ విషయం తెలిసిన అందరూ “ఏంటీ, ప్రభాస్ ఒక్క సినిమాకు ఇంత తీసుకుంటాడా” అంటూ ఆశ్చర్యచకితులు అవుతున్నారు.
రజినీకాంత్ కూడా పనికిరాడు
రజినీకాంత్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సినీ నటుడిగా ప్రస్తుతం ప్రభాస్ అవతరించాడు. అంతే కాదు అతని సినిమాల విలువ రూ.1500 కోట్లకు పైమాటే అంటే అతిశయోక్తి కాదు. ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే.. ఇలా మొత్తం సినిమాల బడ్జెట్ కలిపి రూ.1500 కోట్లట. ఏదిఏమైనా ఈ రేంజ్ లో ఇప్పటివరకు ఏ నటుడు కూడా సినిమాలు తీయలేదు. ఆ విధంగా ప్రభాస్ అత్యధిక డిమాండ్ ఉన్న హీరోగా వెలుగొందుతున్నాడు. అలాగే పౌరాణిక, యాక్షన్ రొమాంటిక్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మూవీస్ లైన్ లో పెట్టారు.
Prabhas ; ఆ సినిమా ఆపేయి అన్నా .. నీకు దండం పెడతాం; ప్రభాస్కు మొర పెట్టుకుంటున్న ఫ్యాన్స్ !