Pragya Jaiswal: సోషల్ మీడియా పరిధి రోజురోజుకీ పెరుగుతూ ఉండటంతో ముఖ్యంగా సినీ ప్రముఖులు చేసే పనులు ఆటోమాటిక్ గా టార్గెట్ చేయబడుతున్నాయి. ఎందుకంటే ఫాలోవర్స్ సహా సామాన్య ప్రజలు కూడా ఇలాంటి విషయాలను ఇపుడు గమనిస్తున్నారు. దీంతో సెలబ్రిటీలు ఒకింత జాగ్రత్తగా పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇదేమి పట్టని మన తారలు కొన్నిసార్లు చేసే పనులతో విమర్శల పాలవుతున్నారు. తాజాగా హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ నెటిజన్స్తో విమర్శలకు గురైంది. ఇంతకీ ఈ అమ్మడు ఏం చేసిందో చూస్తే…
Pragya jaiswal : ప్రగ్యా జైస్వాల్ నయనతార రేంజ్ అంటే మామూలు విషయం కాదు..!
Pragya Jaiswal: ఇదే కారణమా?
అఖండ సినిమాతో భారీ హిట్ ని సొంతం చేసుకున్న ప్రగ్యా జైశ్వాల్ సినిమాల కంటే ఇప్పుడు సోషల్ మీడియాలోనే మంచి యాక్టివ్గా ఉంటుంది. ఇదే క్రమంలో ఆమె తాజాగా ఓ కమర్షియల్ యాడ్ చేసింది. అయితే అదొక ఆల్కహాల్ యాడ్. సదరు యాడ్కు సంబంధించి విస్కీ కంపెనీని ప్రమోట్ చేస్తూ మందు బాటిల్ ఉన్న ఫొటోను షేర్ చేసింది ప్రగ్యా. ఇక అంతే.. నెటిజన్స్ అమ్మడుపై ఓ రేంజ్లో పడిపోతున్నారు. ఈ క్రమంలో పలువురు ఇలా ప్రశ్నిస్తున్నారు… ‘ఇలాంటి కమర్షియల్ యాడ్స్లో నటించటం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు?’ అని అడుగుతున్నారు.
Pragya Jaiswal : వెంకటేశ్ – వరుణ్ తేజ్లతో ప్రగ్యా జైస్వాల్ ఐటెం సాంగ్
సోషల్ మీడియా స్పందన:
డబ్బులు కోసం ఇలా చేస్తారా? అని కొందరు, మీపైన వున్న మంచి అభిప్రాయాన్ని పొగొట్టుకుంటున్నారని మరికొందరు, మీరు ఇలా చేస్తే మిమ్మల్ని అన్ ఫాలో చేస్తామని ఇంకొందరు అంటున్నారు. అయితే కొంతమంది ఆమెకు సపోర్ట్ చేసేవాళ్లు కూడా వున్నారు. ఇది ఆమె వ్యక్తిగత విషయమని, ఆమె యాడ్ చేయకపోతే తాగడం మానేస్తారా? అని కొందరు అంటున్నారు. ఇకపోతే కంచె వంటి డిఫరెంట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్కు ఎందుకనో సమయం పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆశించిన స్థాయిలో విజయాను అందుకోలేకపోయింది.