Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ రోజు ఈడీ విచారణకు హజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుుల దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగిన పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన పార్టీ సీనియర్ నేత కేసి వేణుగోపాల్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేతల అరెస్టు సందర్భంలో పోలీసులు ఈడ్చుకెళ్లినట్లుగా తీసుకువెళ్లారు. ఈ పెనుగులాటలో వేణుగోపాల్ చొక్కా చిరిగిపోయింది. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించిన తీరుపై కేసి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత పోలీసులు అరెస్టు చేసిన నేతలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వేణుగోపాల్ పోలీసు స్టేషన్ లోనే నిరసనకు దిగారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక గాంధీ వాద్రా నేరుగా పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. కేసి వేణుగోపాల్ ను పరామర్శించిన ప్రియాంక గాంధీ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఓ సీనియర్ పార్టీ నాయకుడితో వ్యవహరించేది ఇలాగేనా అంటూ పోలీసుల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఆధీర్ చౌదరి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. మరో పక్క ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీని సుదీర్ఘంగా ఈడీ అధికారుుల విచారణ చేస్తున్నారు.