Psycho Killer Ramulu: మూడుముళ్ల బంధంతో ఒకటై జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్య పెళ్లయిన 15 రోజులకే వేరొక వ్యక్తితో వెళ్ళిపోయింది. అనంతరం రెండో పెళ్లి చేసుకొని భార్య బిడ్డలతో గడుపుతున్న సమయంలో తన భార్యతో విభేదాలు రావడంతో భర్తను వదిలి తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది. దీని తర్వాత మూడో మహిళతో సహజీవనం చేస్తూ వుండగా ఆమె మరొకరితో చనువుగా ఉండటం చూసిన అతడు ఏకంగా సైకో గా మారి 18 మంది మహిళలను హత్య చేసి చివరకు పోలీసుల కంట పడ్డాడు. సినిమాను తలపించేలా ఉన్న ఈ సైకో కిల్లర్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన రాములుకు తలారీ, సాయిలు అనే పేర్లూ ఉన్నాయి. వృత్తిరీత్యా స్టోర్ కట్టర్ అయిన రాములు ప్రస్తుతం బోరబండ గ్రామంలో నివసిస్తున్నారు. తాను పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలు మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం పట్ల భర్తలు ఉండి కూడా డబ్బుకు ఆశపడి మరో మగాడికి లొంగీ పోయే మహిళలను ఎంచుకొని వారిని హత్య చేస్తుంటాడు.తను మోసపోయిన విధంగా ఇతరులు ఎవరూ మోస పోకూడదని ఆ విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న మహిళలను చంపడం ఇతని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ముందుగా అలాంటి మహిళలను గుర్తించి వారితో పరిచయం ఏర్పర్చుకొని వారిని ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారం చేసి చీరతో ఉరి వేసి చంపడం లేదా పెద్ద బండరాళ్ళతో కొట్టి చంపడం చేస్తుంటాడు.అక్కడ అతనికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడుతూ అక్కడినుంచి వెళ్ళి పోతూ ఉంటాడు. ఇలాంటి హత్య కేసులలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చిన రాములు తాజాగా గత ఏడాది డిసెంబర్ 10న బాలానగర్ కల్లు కాంపౌండ్ నుంచి ఓ మహిళను ములుగు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో కలసి మద్యం తాగి హత్య చేశాడు. ఈ విషయంపై రంగంలోకి దిగిన పోలీసులు ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్రెడ్డి, బి.పరమేశ్వర్ తదితరులు సీసీ కెమెరాల ఫీడ్లో చిక్కిన ఫీడ్ ఆధారంగా రాములును పట్టుకున్నారు.