రామ్ త్వరలో రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డ్యూయల్ రోల్ లో నటించిన రామ్ రెండు మాస్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయ్యాడు. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్ళు సాధించిన తడం సినిమాకి రీమేక్ గా రూపొందింది. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో యూత్ కి హీటెక్కించబోతోంది. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతమందించాడు.
ఇస్మార్ట్ శంకర్ లాంటీ భారీ హిట్ అందుకున తర్వాత వస్తున్న రెడ్ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు… దర్శకుడు ఎవరు.. కథ ఏంటి .. ఇలాంటి చాలా విషయాలలో క్లారిటీ లేక ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు క్లారిటీ ఇమ్మని కోరారు. కాగా రామ్ కూడా ఈ విషయంలో ఎప్పటికప్పుడు దాటవేస్తూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే రెడ్ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా రామ్ తన నెక్స్ట్ సినిమా విషయంలో హింట్ ఇచ్చాడు.
ఇన్నాళ్ళు ప్రచారం జరిగినట్టే త్రివిక్రం దర్శకత్వంలో రామ్ నెక్స్ట్ సినిమాని చేయబోతున్నట్టు తెలిపాడు. కాకపోతే కాస్త టైం పడుతుందని అంటున్నాడు. అలాగే సొంత నిర్మాణ సంస్థ లో కూడా రామ్ రాం సినిమా ఉండబోతుందని త్వరలో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలను వెల్లడించబోతున్నట్టు చెప్పుకొచ్చాడు రామ్. ఇక ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కూడా పట్టాలెక్కే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మించనున్నారట.