తమిళంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా మానాడు సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నిజానికి వెంకట్ ప్రభు, శింబులకు మళ్లీ మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా కూడా అదే. మొదట ఈ సినిమాను తెలుగులోనే డైరెక్ట్ చేయటానికి చాలామంది హీరోలకి కథ వినిపించాడు. కానీ ఎవరూ కథను ఒప్పుకోకపోవడంతో తమిళంలో శింబుతో తెరకెక్కించాడు. తమిళంలో ఈ కథ హిట్ అవ్వడంతో ఇప్పుడు అదే కథను రీమేక్ రైట్స్ని హీరో రానా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను రానా, ఆసియన్ సునీల్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమయ్యారు.
హీరోలు కూడా సెలెక్ట్
ఈ సినిమా కోసం ఒక మంచి కాంబినేషన్ని కూడా సెలెక్ట్ చేసారు. మాస్ మహారాజా రవితేజ, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్గా తీసుకోవాలని ప్రొడక్షన్ టీమ్ సిద్ధమైంది. ఇక స్క్రిప్ట్ను డైరెక్టర్ హరీష్ శంకర్ అందిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు డైరెక్టర్ దశరత్ తీసుకున్నారు. కాగా ఈ మూవీకి రానా ఒక నిర్మాతగానే ఉంటారు. కాగా హరీష్ శంకర్ రీమేక్ సినిమాలకు మంచి స్క్రిప్ట్ లు రాయడంలో దిట్ట. గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ సినిమాలతో ఆయన పనితనాన్ని నిరూపించుకున్నాడు.
రీమేక్లో చేంజెస్
ఇప్పుడు మానాడు రీమేక్ విషయంలో కూడా తెలుగులో సెట్ అయ్యే విధంగా స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మానాడు సినిమాను వున్నది ఉన్నట్లుగా రీమేక్ చేయాలా? లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు అనే దాని గురించి చర్చలు నడిచాక. ఇక హరీష్ శంకర్ విషయానికి వస్తే తన పని తను మొదలు పెట్టినట్లే అని తెలుస్తుంది. ఈ సినిమాతోనైనా రవితేజ కంబ్యాక్ ఇస్తాడో చూడాలి మరి.