ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుపై శుక్రవారం కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది. హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పల్ చౌహన్ నేతృత్వంలో పునర్విభజన చట్టంతో సంబంధమున్న అన్ని శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. విభజన చట్టంలోని 13 వ షెడ్యూల్ పై అధికారులు ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. అలాగే విభజన చట్టంలో పెండింగ్లో అంశాలపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ నుంచి నీరబ్ కుమార్, కరికాల వలవన్, దమయంతి, ఆరోఖ్య రాజ్, ప్రేమ్ చంద్రారెడ్డి, తెలంగాణ నుంచి రామకృష్ణ రావు, వేదాంతం గిరిలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) విభజన జరిగిన విషయం తెలిసిందే.
(ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం షెడ్యూల్ 13 : ఉన్నత విద్య మౌలిక సదుపాయాల కల్పన)