సిడ్నీ(ఆస్ట్రేలియా), జనవరి 12: భారత జట్టు ఓపెనర్ రాహుల్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. ఆసీస్పై సిడ్నీ వేదికగా శనివారం జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో రాహుల్ తన వన్డే కెరీర్లో 22వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 128 బంతుల్లో 133 పరుగులు చేసిన శర్మ స్టోన్స్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ప్రస్తుతం క్రీజ్లో భువనేశ్వర్ కుమార్ నాలుగు పరుగులతో, యాదవ్ రెండు పరుగులతో ఉన్నారు..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారత్ ముందు 289 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
జట్టులో ధోని 51 పరుగులు సాధించగా, దినేష్ కార్తీక్ 12, జడేజా ఎనిమిది పరుగులు సాధించాడు. కెప్టెన్ కోహ్లి మూడు పరుగులు చేయగా శిఖర్ థావన్, అంబటి రాయుడు ఇద్దరూ డకౌట్గా వెనుదిరిగారు.
46 ఓవర్లు ముగిసేసరికి టీం ఇండియా ఏడు వికెట్లు కోల్పొయి 222 పరుగులు సాధించింది.