పులివెందుల(కడప), జనవరి 12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు. పాదయాత్ర ముగించుకుని వచ్చిన ప్రతిపక్ష నేత శనివారం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, అనంతరం చక్రయ్యపేట మండలంలోని వీరన్నగట్టుపల్లిలోని గండి వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు.
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆయన 2516 గ్రామాల్లో 3648 కిలోమీటర్ల మేర 341 రోజుల పాటు నడిచారు.
2017 నవంబరు ఆరున ఇడుపుల పాయనుంచి ఆయన యాత్రను ప్రారంభించారు.
previous post
next post