YSRCP: డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అధికారికంగా వైసీపీలో చేరకముందే ఆవనిగడ్డ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా నియమితులైయ్యారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన జాబితాలో అవనిగడ్డ పార్టీ ఇన్ చార్జిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఆయన తనయుడు సింహాద్రి రాంచరణ్ లు సోమవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
తండ్రీ కొడుకులకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తనను నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించడం పట్ల సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేసిన డాక్టర్ చంద్రశేఖర్ రావు ..ఈ సందర్భంలో కీలక ప్రతిపాదన చేశారు. వయసు రీత్యా ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని జగన్ కు తెలియజేస్తూ.. తనకు బదులుగా తన కుమారుడికి ఆవినగడ్డ సీటు ఇవ్వాలని జగన్ ను కోరారు.
రాంచరణ్ అయితే ప్రజల్లో ఉత్సాహంగా తిరిగి పని చేస్తాడని చెప్పారు. గడప గడపకు తిరిగి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వైసీపీ గెలుపునకు ప్రయత్నిస్తారని తెలిపారు. మూడు తరాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ఆవనిగడ్డ ప్రజలకు సేవలందించిందన్నారు.
ప్రస్తుత ఆవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తమకు సహకరిస్తారని చంద్రశేఖర్ రావు తెలిపారు. సీఎం జగన్ తో భేటీ అనంతరం మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు డాక్టర్ చంద్రశేఖర్ రావు. రాంచరణ్ ను ఆవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
కాగా, దివంగత మాజీ మంత్రి సింహద్రి సత్యనారాయణ తనయుడే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు. డాక్టర్ బొత్స సత్యనారాయణ సిఫార్సు మేరకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావ
AP Assembly: ఈ నెల 8వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ..7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్