తేనెలో అనేక ఔషధ గుణాలు ఉండడం వలన శరీరానికి కావలిసిన ఎన్నో పోషకాలు తేనే ద్వారా అందుతున్నాయి. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు తేనెలో ఉన్నందున్న శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, బలాన్నికలిగిస్తుంది. అయితే తేనెలో ఎండు ఖర్జూరం పండ్లను వారం రోజుల పాటు నానబెట్టిన తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు.
ఈ రెండింటిని కలపడం వలన వాటిలో ఎక్కువగా ఉండే కాల్షియం, ఐరన్ రక్త హీనతను తగ్గిస్తాయి. ఎముకలు బలంగా మారుతాయి. షుగర్ స్థాయి అదుపులో ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవాళ్లు కూడా ఈ మిశ్రమాన్ని తింటే తగిన ఫలితం పొందుతారు. దీనికోసం ఏంచేయాలో తెలుసుకుందాం. ఒక జార్లో 3వ వంతులు ఉండేలా తేనె పోయాలి.
ఆ తేనెలో గింజలు తీసేసిన ఎండు ఖర్జూరం పండ్లను వేయాలి. తర్వాత మూత బిగించి జార్ను బాగా కుదపాలి. తేనెలో వేసిన ఖర్జురం అంతటికి తేనే బాగా పట్టాలి. ఆ తరువాత ఆ జార్ను వారం పాటు అలాగే ఉంచేయాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్య లో ఆ జార్ను కుదిపి పెట్టేస్తూ ఉండవచ్చు. వారం తరువాత జార్ను తీసి, రోజుకు ఒకటి రెండు చొప్పున ఆ ఖర్జూర పండ్లను తింటూ ఉండాలి.
తేనె తో కలిసిన ఎండు ఖర్జూరం తినడం వల్ల జలుబు,దగ్గు, వంటి శ్వాస కు సంబందించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. జ్వరం తగ్గుతుంది. శరీరం లో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు దగ్గరకిరావు. నిద్ర బాగా పడుతుంది. నిద్ర లేమితో బాధపడేవారు ఈ మిశ్రమం తీసుకుంటే మంచి ఫలితం పొందుతారు. ఒత్తిడి, ఆందోళన వంటివీ కూడా తగ్గిపోతాయి. యాంటీ బయోటిక్ గుణాల వల్ల పుండ్లు, గాయాలు త్వరగా తగ్గిపోతాయి.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!