హైదరాబాదు, ఏప్రిల్ 23: ఇంటర్ బోర్డు ఫలితాల అవకతవకల ఫై ఒక పక్క ఇంటర్ బోర్డు వద్ద ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూనే మరో పక్క న్యాయ పోరాటానికి విద్యార్థి సంఘాలు సిద్ధమయ్యారు. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపు ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకోవడంతో ఉద్రికత పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యేక పోలీస్ బలగాలతో మూడంచెల భద్రతా చర్యలు చేపట్టారు. ఇద్దరు డిఎస్పిలు భారీ పొలిసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తూ విద్యార్థుల ఆందోళనను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో ఆందోళన చేస్తున్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయమై కొందరు విద్యార్థులు మాట్లాడుతూ.. తాము రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా బోర్డు వెబ్ సైట్ పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో పక్క ఇంటర్ పలితాల అవకతలకలపై న్యాయపోరాటంలో భాగంగా బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుందని సమాచారం.